PM Modi: ‘‘మాట పదిలం’’.. ఎన్డీయే నాయకులకు ప్రధాని కీలక సలహా..
- ‘‘మాట పదిలం’’, ఎన్డీయే నేతలకు ప్రధాని సూచన..
- వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని హితవు..
- ఇటీవల వివాదాల నేపథ్యంలో ప్రధాని మోడీ నుంచి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఢిల్లీలో ప్రధాని నేతృత్వంలో ఎన్డీయే ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేడీ నడ్డా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్డీయే నాయకులకు ప్రధాని నరేంద్రమోడీ కీలక సూచనల చేశారని తెలుస్తోంది. నాయకులు బహిరంగ ప్రకటనలు చేసే సమయంలో సంయమనం పాటించాలని కోరారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
పార్టీ నాయకులు చేసే అనవసరమైన ప్రకటనలపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారని, విచక్షణారహిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని వారిని కోరినట్లు తెలుస్తోంది. ‘‘ఎక్కడైనా ఏదైనా మాట్లాడటం మానుకోవాలి’’ అని, క్షమశిక్షణతో కూడిన సంభాషణ అవసరమని ప్రధాని మోడీ చెప్పారు. మధ్యప్రదేశ్, హర్యానాకు చెందిన బీజేపీ నేతలు ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రధాని మోడీ నుంచి ఈ సలహా వచ్చింది. “ఆపరేషన్ సిందూర్” అంశంపై, ఏ మూడవ పక్షం ప్రమేయం లేదని ప్రధాని స్పష్టం చేశారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంలకు ఆయన తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో మీడియా సమావేశాలకు ప్రాతినిధ్యం వహించిన కల్నర్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ బీజేపీ నేత, ఎమ్మెల్యే విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విజయ్ షా మాట్లాడుతూ…ఆపరేషన్ సిందూర్లో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారి సమాజం నుంచే ఒక సోదరిని పంపామని చెప్పడం వివాదంగా మారింది. ఇదే విధంగా, మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పాదాలకు సాయుధ దళాలు నమస్కరించాలని చెప్పడం కూడా వివాదంగా మారింది.
తాజావార్తలు
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!