Pollution Control: వాహనదారులకు ప్రభుత్వం షాక్.. ఈ వెహికల్స్ కు పెట్రోల్-డీజిల్ బంద్..?
- వాహనదారులకు ప్రభుత్వం షాక్
- ఈ వెహికల్స్ కు పెట్రోల్-డీజిల్ బంద్..?
- ఢిల్లీ ప్రభుత్వం వాహనాలకు సంబంధించి కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బండి ముందుకు కదలాలంటే ఫ్యుయల్ ఖచ్చితంగా ఉండాల్సిందే. పెట్రోల్, డీజిల్ లేకపోతే వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోతాయి. మరి మీకు కూడా పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలు ఉన్నాయా? అయితే మీకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ అందించడంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వెహికల్స్ కు అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ అందించబోమని స్పష్టం చేసింది. అయితే ఇది మనదగ్గర కాదండోయ్ ఢిల్లిలో. ఢిల్లీ ప్రభుత్వం శనివారం నాడు వాహనాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఏవాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్ కానుందంటే?
Also Read: KTR: త్వరలో ఉపఎన్నికలు వస్తాయి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
ఢిల్లీలో మార్చి 31 తర్వాత పెట్రోల్ పంపులలో 15 ఏళ్లు పైబడిన వాహనాలకు పెట్రోల్, డీజిల్ ఇవ్వబోమని పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. మార్చి 31 తర్వాత నగరంలోని పెట్రోల్ బంకుల్లో 15 ఏళ్లు పైబడిన వాహనాలకు పెట్రోల్ సరఫరాను నిలిపివేస్తామని మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా శనివారం ప్రకటించారు. అంటే ఏప్రిల్ 1 నుంచి 15 ఏళ్లు పైబడిన వాహనాలకు పెట్రోల్, డీజిల్ లభించదు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టే చర్యలపై చర్చించడానికి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాహనాల ఉద్గారాలు, కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోందని సిర్సా అన్నారు.
Also Read:Solar E- Scooter: స్క్రాప్తో 7 సీటర్ సోలార్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ.. ఏకంగా 200 కి.మి రేంజ్!
పాత వాహనాలపై నిషేధం, పొగమంచు నిరోధక చర్యలు, ప్రజా రవాణాలో విద్యుత్ వాహనాలను ఉపయోగించడం వంటి కీలక నిర్ణయాలపై చర్చించినట్లు తెలిపారు. సమావేశం తర్వాత సిర్సా మాట్లాడుతూ, “15 సంవత్సరాల కంటే పాత వాహనాలను గుర్తించే గాడ్జెట్లను పెట్రోల్ పంపుల వద్ద ఏర్పాటు చేస్తున్నాము, గుర్తించిన వెహికల్స్ కు ఇంధనం అందించబడదు” అని అన్నారు. ఈ నిర్ణయం గురించి ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు తెలియజేస్తుందని ఆయన అన్నారు.
Also Read:Re Shoot: 10 కోట్లు బూడిదలో పోయించిన పాన్ ఇండియా స్టార్
పాత వాహనాలకు ఇంధన సరఫరాను నిలిపివేయడమే కాకుండా, వాయు కాలుష్య స్థాయిలను అరికట్టడానికి రాజధానిలోని అన్ని ఎత్తైన భవనాలు, హోటళ్ళు, వాణిజ్య సముదాయాలలో యాంటీ-స్మోక్ గన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సిర్సా తెలిపారు. ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీలోని దాదాపు 90 శాతం ప్రభుత్వ CNG బస్సులను డిసెంబర్ 2025 నాటికి దశలవారీగా నిలిపివేసి, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
-
mAadhaar app: ఎమ్-ఆధార్ యాప్కు గుడ్బై.. నేటి నుంచి పాత యాప్ సేవలు నిలిపివేత.. కొత్త Aadhaar యాప్లో అదిరే ఫీచర్లు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!