Janata Dal United: రావడం కుదరదు.. కాంగ్రెస్ ఆహ్వానాన్ని తిరస్కరించిన జేడీయూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar Party JDU To Skip Bharat Jodo Yatra Event In Srinagar: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలోనే యాత్ర ముగింపు సభను జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ ముగింపు సభకు హాజరు కావాల్సిందిగా.. ఒక్క బీజేపీని మినహాయించి మొత్తం 24 రాజకీయ పార్టీలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానం పంపడం జరిగింది. అయితే.. ఈ ఆహ్వానాన్ని నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ (జనతాదళ్ యునైటెడ్) తిరస్కరించింది. అదే రోజు నాగాలాండ్లో తమ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తోందని.. కాబట్టి భారత్ జోడో యాత్ర ముగింపు సభకు రావడం కుదరదని ఖర్గేకు జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ లేఖ రాశారు.
Nandamuri Balakrishna: అక్కడ ఆప్యాయత లేదు.. మరోసారి మాట తూలిన బాలయ్య
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
“దేశంలో ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తున్నాయని.. అనియంత్రిత కార్యనిర్వాహక అధికారంపై నియంత్రణలు, సమతుల్యతలను నిర్ధారించాల్సిన రాజ్యాంగ సంస్థలు నాశనం చేయబడుతున్నాయనే రెండు అభిప్రాయాలు లేవు. నేను చారిత్రక సంఘటనకు హాజరు కావాలనుకుంటున్నాను. అదే రోజు నాగాలాండ్లో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు నేను హాజరుకావాల్సిన అవసరం ఉంది. కాబట్టి.. జోడో యాత్ర ముగింపు సభకు రాలేను. ఇందుకు నేను చింతిస్తున్నాను’’ అంటూ ఆ లేఖలో రాజీవ్ రంజన్ సింగ్ పేర్కొంది. ఒకరకంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. ఎందుకంటే.. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఐక్యమవ్వాలని అనుకున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు కాంగ్రెస్ ఆహ్వానాన్ని జేడీయూ తిరస్కరించడం.. ఆ రెండు పార్టీల మధ్య అభిప్రాయబేధాలకు తావిచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..