Botsa satyanarayana: పవన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రాజకీయం ఎన్నికలకు ముందే వేడెక్కింది. వైసీపీ వర్సెస్ జనసేన విమర్శల జోరు పెరుగుతూనే వుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. పవన్ ఉగ్రవాది అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పవన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది… ఎవరిని కొడతాడు? ఎవరిని బెదిరిస్తాడు.?రిపబ్లిక్ డే రోజున ఎవరైనా హుందాగా మాట్లాడుతారు. సన్నాసి మాటలు మాట్లాడి మాచేత కూడా మాట్లాడిస్తున్నాడన్నారు మంత్రి బొత్స.
Read Also: Balakrishna Response on SVR Issue Live: ఎస్వీ రంగారావు వివాదంపై బాలయ్య స్పందన
Also Read
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
రిపబ్లిక్ డే రోజున ఎవరైనా హుందాగా మాట్లాడతారు. సెలబ్రిటీ పార్టీ నాయకుడు సన్నాసి మాటలు మాట్లాడి మాచేత కూడా మాట్లాడిస్తున్నాడు. పిచ్చెక్కి పోయి మాట్లాడుతున్నాడన్నారు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. ఉగ్రవాది అయిపోతే… చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. ఎవరిని కొడతాడు? ఎవరిని బెదిరిస్తాడు? డీబీటీ ద్వారా 60 వేల కోట్లు ఇచ్చాం అన్నారు. అణగారిన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడితే పవన్ కళ్యాణ్ కు ఏంటట బాధ?వాక్ స్వాతంత్రం ఉందని ఇలా మాట్లాడటం కరెక్టేనా? ఈ భాష ద్వారా వచ్చే తరాలకు ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నాడు?
మా ప్రభుత్వ విధానం వికేంద్రీకరణ అన్నారు. మూడు రాజధానులు మా విధానం అన్నారు. ఇంతకు ముందూ చెప్పాం… మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం. పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక పెద్ద బండి కొనుక్కుని ఉంటాడు. ఏముంది దాంట్లో?? దీనికి సన్నాసి, పనికి మాలిన మాటలు ఎందుకు. ఇలాంటి వాళ్ళను చూస్తుంటే రాజకీయాలు అంటేనే విరక్తి వస్తోంది అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ది దోపిడి విధానం, మాది అభివృద్ధి విధానం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాకు చిత్తశుద్ధి, ప్రేమ ఉండవా?కైకై అని అరిచి మాట్లాడితే ప్రేమ ఉన్నట్లా??విశాఖ రాజధాని పై బొత్స కీలక వ్యాఖ్యలు. కొత్త సంవత్సరాది నుంచి విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని మేం ముఖ్యమంత్రి పై ఒత్తిడి చేస్తున్నాం. క్యాబినెట్ మంత్రులు అడిగితే ముఖ్యమంత్రి కుదరదు అనరుగా. సానుకూలంగా స్పందిస్తారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. సెలెక్టర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు!
-
PV Sindhu: సెమీస్లో అదరగొట్టిన పీవీ సింధు.. జపాన్ ఓపెన్ టైటిల్కు ఒక్క అడుగు దూరంలో
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!