MPs At Parlament: పార్లమెంట్ ఆవరణలో రాత్రంతా విపక్ష ఎంపీల నిరసన దీక్ష.. మణిపూర్ పై ఆరని మంటలు
MPs At Parlament: మణిపూర్లో జరుగుతున్న మారణకాండపై ప్రతిపక్షాలు పార్లమెంటును స్థంభింపచేస్తున్నాయి. మణిపూర్ సమస్యపై చర్చించాలని ఇటు లోక్సభతోపాటు.. రాజ్యసభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటు స్థంభించిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంటును వాయిదా వేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన కొనసాగించారు. సోమవారం రాత్రంతా నిరసన దీక్ష చేపట్టారు. రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మూడు నెలలుగా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మణిపూర్ హింసాకాండ పార్లమెంట్ ను కుదిపేస్తోంది. ఆందోళనలు, అల్లర్లు, హింసాకాండ ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతుంటే ప్రధాని మోదీ కనీసం మాట్లాడటం లేదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై మోదీ తక్షణమే సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష నేతల నినాదాలు, ఆందోళనలు, నిరసనలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడు రోజులుగా స్తంభిస్తున్నాయి.
Read also: Polavaram: ఏపీకి తెలంగాణ లేఖ.. పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచాలి..
Also Read
- PM Modi Reaction: దీదీ కోటలో మోడీ సునామీ.. బెంగాల్ గడ్డపై ఎగిరిన కాషాయ జెండా! ప్రధాని మోదీ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Jofra Archer: అద్భుతం.. విజయ్ గెలుపును ముందే ఊహించి ట్వీట్ చేసిన క్రికెటర్ జోఫ్రా ఆర్చర్..
- Vijay Dhamu: ఆటో స్టాండ్ నుంచి అసెంబ్లీకి.. రాయపురంలో మాజీ మంత్రి కోటను కూల్చిన సామాన్యుడు!
- Kavitha: పాత రాజకీయాలకు విసిగిపోయారు.. తెలంగాణలో కూడా మార్పు తథ్యం: కవిత
వర్షాకాల సమావేశాలు వరుసగా మూడో రోజైన సోమవారం పార్లమెంట్ లో మణిపూర్ అంశంపై ప్రతిష్టంభన కొనసాగింది. ఉభయ సభలు ప్రతిపక్షాల ఆందోళనలతో అట్టుడికాయి. ప్రతిపక్ష నాయకుల నినాదాలతో సభలు హోరెత్తాయి. మణిపూర్ అంశంపై ప్రధాని సమాధానం చెప్పాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో విపక్ష ఎంపీలు సోమవారం రాత్రి పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన కొనసాగించారు. మణిపూర్ లో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోదీ సమగ్ర ప్రకటన చేయాలంటూ ప్రతిపక్ష కూటమి అయిన ‘ఇండియా’ పార్లమెంట్ ఆవరణలో రాత్రంతా ఆందోళన చేపట్టింది. ‘మణిపూర్ కోసం భారత్’, ‘భారత్ డిమాండ్ మణిపూర్’ ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శిస్తూ నిరసన కొనసాగించారు. ఆప్, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొనడం విశేషం.
తాజావార్తలు
-
Chiranjeevi: విజయ్ విజయంపై స్పందించిన చిరంజీవి
-
PM Modi Reaction: దీదీ కోటలో మోడీ సునామీ.. బెంగాల్ గడ్డపై ఎగిరిన కాషాయ జెండా! ప్రధాని మోదీ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Ranabaali : లక్షకు పైగా రీల్స్ తో ట్రెండ్ అవుతున్న “రణబాలి” ‘ఏందయ్య సామీ..’ సాంగ్/
-
Vijay – Trisha: అసలు విజయ్ – త్రిషల మధ్య ఏముంది?
-
Duvvada Madhuri : త్రిష కోరికతో పాటు నా కోరిక కూడా నెరవేరింది
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!