Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ బీపీవో కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై కీలక విచారణ ముగిసింది. ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న నాసిక్ రోడ్ సెషన్స్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2వ తేదీన కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ తీర్పుపైనే నిలిచింది. ఈ కేసులో మతమార్పిడి ప్రయత్నం, మత మనోభావాలను దెబ్బతీయడం, లైంగిక వేధింపులు వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నట్లు పేర్కొనబడింది. కేసు మొదటి నుంచే వివాదాస్పదంగా మారగా, ఇప్పుడు బెయిల్ విచారణతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also: CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
Also Read
- MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
- Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
- Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్పై కీలక విషయాలు
- Nepal Floods: నేపాల్ ప్రళయంలో మాజీ కేంద్ర మంత్రి కోడలు గల్లంతు
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అజయ్ మిసర్ను నియమించింది. ఈ కేసుకు సంబంధించిన మొత్తం తొమ్మిది కేసుల్లో ఆయన ప్రాసిక్యూషన్ తరఫున వాదిస్తున్నారు. గతంలో మాలేగావ్ పేలుళ్లు, పీఎఫ్ఐ, ముంబై పేలుళ్లు వంటి హైప్రొఫైల్ కేసుల్లో ఆయన వాదనలు వినిపించిన అనుభవం కలిగి ఉన్నారు. నిదా ఖాన్కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేసులో ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు తెలిపారు. ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే ప్రమాదం కూడా ఉందని వాదించారు. అందువల్ల బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని పోలీసులు కోర్టును కోరారు.
ఇక, బాధితుల తరఫు న్యాయవాదులు కూడా బెయిల్కు వ్యతిరేకంగా జోక్య పిటిషన్ దాఖలు చేశారు. బాధితులకు తీవ్ర అన్యాయం జరిగిందని, నిందితురాలికి ఉపశమనం కల్పించడం న్యాయ ప్రక్రియను దెబ్బతీయవచ్చని పేర్కొన్నారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఉపశమనం ఇవ్వవద్దని కోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో మే 2న వెలువడే కోర్టు తీర్పు ఈ కేసులో కీలక మలుపు కానుంది. బెయిల్ మంజూరు చేస్తారా? లేక తిరస్కరిస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు నిర్ణయం నిందితురాలి భవిష్యత్తుతో పాటు కేసు దర్యాప్తు దిశను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
-
Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
-
Nepal Floods: నేపాల్కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!