Amit Shah: ఢిల్లీకి రాష్ట్ర హోదాను నెహ్రూ, అంబేద్కర్ వ్యతిరేకించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: ఢిల్లీకి రాష్ట్ర హోదాను ఇవ్వడాన్ని మొదటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూతోపాటు అప్పటి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడా వ్యతిరేకించారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఢిల్లీ ఆర్డినెన్స్ పై చట్టం చేసే సమయంలో ప్రవేశ పెట్టిన బిల్లుపై లోక్సభలో అమిత్ షా మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు తమ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించాలని హోం మంత్రి అమిత్ షా సూచించారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుపై జరుగుతోన్న చర్చలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జవహర్లాల్ నెహ్రూ, అంబేడ్కర్ వంటి నేతలు ఢిల్లీకి రాష్ట్ర హోదాను వ్యతిరేకించారన్నారు. ‘మీ కూటమిలో ఉన్నారన్న ఒక్క కారణం చేత, ఢిల్లీలో జరుగుతోన్న అవినీతికి మద్దతు పలకొద్దని అన్ని పార్టీలను కోరుతున్నాను. ఎందుకంటే ఈ కూటమి ఉన్నప్పటికీ.. ప్రధాని మోదీ రాబోయే ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో విజయం సాధిస్తారని వ్యాఖ్యానించారు.
Read also: Meera Chopra: అప్పుడు ఫిర్యాదు చేసిన బీజేపీకి పవన్ హీరోయిన్ మద్దతు
Also Read
- MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
‘2015లో ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చింది. వారి ప్రధాన ఉద్దేశం ఘర్షణపడటమే. ఇక్కడ బదిలీల అంశం సమస్య కాదు. వారి బంగ్లాల నిర్మాణం వంటి వాటిల్లో జరుగుతోన్న అవినీతి దాచేందుకు విజిలెన్స్ విభాగాన్ని నియంత్రిస్తుండటమే అసలు సమస్య. 2015 ముందువరకు వివిధ ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని పరిపాలన వ్యవహారాలు సజావుగా సాగాయి’ అని ఆప్పై అమిత్ షా విమర్శలు గుప్పించారు. జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లాభాయ్ పటేల్, సి. రాజగోపాల చారి, రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేడ్కర్ వంటి నేతలు కూడా ఢిల్లీకి పూర్తిస్థాయి హోదా ఇవ్వాలన్న ఆలోచనను వ్యతిరేకించారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాధికారులపై ఎవరి నియంత్రణ ఉండాలన్న విషయంపై గత కొన్నేళ్లుగా కేంద్రం, ఆప్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న న్యాయపోరాటంపై కొద్ది నెలల క్రితం ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఐఏఎస్లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పు అనంతరం పరిపాలన సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్కు అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. దాని స్థానంలో రూపొందించిన బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ‘ఢిల్లీకి సంబంధించి ఏ అంశంపైన అయినా పార్లమెంట్కు చట్టం చేసే అధికారం ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆ ఆర్డినెన్స్ వెల్లడిచేస్తోంది. ఢిల్లీకి సంబంధించి చట్టాలను రూపొందించేందుకు రాజ్యాంగంలోని నిబంధనలు అనుమతిస్తున్నాయని అమిత్ షా తెలిపారు.
తాజావార్తలు
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..