NEET UG Re Exam 2026: నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్.. 1.3 లక్షల సీసీటీవీ కెమెరాలు, 51 వేల జామ్మర్లతో భద్రతా ఏర్పాట్లు
- నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్
- ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పరీక్ష నిర్వహించేందుకు విస్తృత భద్రతా ఏర్పాట్లు
- వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా నీట్-యూజీ (NEET-UG) పునఃపరీక్ష నేడు జరగనుంది. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పరీక్ష నిర్వహించేందుకు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ (NTA) వెల్లడించింది. సోషల్ మీడియాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రశ్నపత్రాల లీకేజీపై తప్పుడు ప్రచారం లేదా వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు కేవలం ఎన్టీఏ విడుదల చేసే అధికారిక సమాచారాన్నే నమ్మాలని సూచించింది. పరీక్ష నిర్వహణ సన్నాహాలను పరిశీలించేందుకు శనివారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆదివారం జరిగే పునఃపరీక్షకు 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు కొనసాగుతుంది.
Also Read
- CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
- IMD Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్షాలు
- Nitin Gadkari: 2016కు ముందు వాహనాలకు కొన్ని మార్పులు అవసరం.. E20 పెట్రోల్పై గడ్కరీ..
- Trump-Iran: జోర్డాన్లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
పేపర్ లీకేజీ ఆరోపణలతో పరీక్ష రద్దు
ఈ ఏడాది మే 3న నిర్వహించాల్సిన నీట్-యూజీ పరీక్షను ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో మే 12న ఎన్టీఏ రద్దు చేసింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.
1.38 లక్షల సీసీటీవీ కెమెరాలు
దేశవ్యాప్తంగా 551 నగరాల్లోని 5,440 పరీక్షా కేంద్రాలు, విదేశాల్లోని 14 కేంద్రాల్లో పునఃపరీక్ష నిర్వహించనున్నారు. 95 వేలకుపైగా పరీక్షా గదుల్లో ప్రతి గదికి ఒక సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశారు. మొత్తం 1,38,560 సీసీటీవీ కెమెరాల ద్వారా పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. వీటి ఫీడ్లను జాతీయ, రాష్ట్ర, మంత్రిత్వ శాఖల స్థాయిలో అధికారులు పరిశీలిస్తారు.
51,311 జామర్లు ఏర్పాటు
ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఎలాంటి జోక్యం జరగకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా 51,311 జామర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా గదిలో ఇద్దరు ఇన్విజిలేటర్లను నియమించగా, ప్రతి కేంద్రంలో అదనంగా 10 మందికి పైగా సిబ్బందిని మోహరించారు. సీసీటీవీ ఫీడ్లను పర్యవేక్షించడం, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం ప్రతి కేంద్రంలో ఒక “సెంటర్ మానిటరింగ్ ఆఫీసర్” (CMO)ను నియమించారు.
భారీగా భద్రతా బలగాల మోహరింపు
పరీక్ష నిర్వహణ కోసం పోలీసు, పారామిలిటరీ దళాలు, భారత వైమానిక దళం, తపాలా శాఖ సిబ్బందితో పాటు రాష్ట్ర, జిల్లా పరిపాలనా యంత్రాంగాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సగటున 40 నుంచి 50 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు ఎన్టీఏ తెలిపింది. అలాగే ప్రశ్నపత్రాలు, గోప్యమైన సమాచార భద్రత కోసం సుమారు 1,500 బ్యాంకు శాఖల్లో ప్రత్యేక అధికారులను నియమించారు. దేశవ్యాప్తంగా సుమారు 700 కేంద్రాల నుంచి ఓఎంఆర్ షీట్ల సేకరణ కోసం తపాలా శాఖ ప్రత్యేక బృందాలతో సమన్వయం చేస్తోంది. పరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించినట్లు ఎన్టీఏ వెల్లడించింది.
- Tags
- NEET
- NEET UG 2026 re exam
- NTA
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!