NEET UG Re Exam 2026: నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్.. 1.3 లక్షల సీసీటీవీ కెమెరాలు, 51 వేల జామ్మర్లతో భద్రతా ఏర్పాట్లు
- నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్
- ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పరీక్ష నిర్వహించేందుకు విస్తృత భద్రతా ఏర్పాట్లు
- వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా నీట్-యూజీ (NEET-UG) పునఃపరీక్ష నేడు జరగనుంది. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పరీక్ష నిర్వహించేందుకు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ (NTA) వెల్లడించింది. సోషల్ మీడియాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రశ్నపత్రాల లీకేజీపై తప్పుడు ప్రచారం లేదా వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు కేవలం ఎన్టీఏ విడుదల చేసే అధికారిక సమాచారాన్నే నమ్మాలని సూచించింది. పరీక్ష నిర్వహణ సన్నాహాలను పరిశీలించేందుకు శనివారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆదివారం జరిగే పునఃపరీక్షకు 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు కొనసాగుతుంది.
Also Read
పేపర్ లీకేజీ ఆరోపణలతో పరీక్ష రద్దు
ఈ ఏడాది మే 3న నిర్వహించాల్సిన నీట్-యూజీ పరీక్షను ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో మే 12న ఎన్టీఏ రద్దు చేసింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.
1.38 లక్షల సీసీటీవీ కెమెరాలు
దేశవ్యాప్తంగా 551 నగరాల్లోని 5,440 పరీక్షా కేంద్రాలు, విదేశాల్లోని 14 కేంద్రాల్లో పునఃపరీక్ష నిర్వహించనున్నారు. 95 వేలకుపైగా పరీక్షా గదుల్లో ప్రతి గదికి ఒక సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశారు. మొత్తం 1,38,560 సీసీటీవీ కెమెరాల ద్వారా పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. వీటి ఫీడ్లను జాతీయ, రాష్ట్ర, మంత్రిత్వ శాఖల స్థాయిలో అధికారులు పరిశీలిస్తారు.
51,311 జామర్లు ఏర్పాటు
ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఎలాంటి జోక్యం జరగకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా 51,311 జామర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా గదిలో ఇద్దరు ఇన్విజిలేటర్లను నియమించగా, ప్రతి కేంద్రంలో అదనంగా 10 మందికి పైగా సిబ్బందిని మోహరించారు. సీసీటీవీ ఫీడ్లను పర్యవేక్షించడం, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం ప్రతి కేంద్రంలో ఒక “సెంటర్ మానిటరింగ్ ఆఫీసర్” (CMO)ను నియమించారు.
భారీగా భద్రతా బలగాల మోహరింపు
పరీక్ష నిర్వహణ కోసం పోలీసు, పారామిలిటరీ దళాలు, భారత వైమానిక దళం, తపాలా శాఖ సిబ్బందితో పాటు రాష్ట్ర, జిల్లా పరిపాలనా యంత్రాంగాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సగటున 40 నుంచి 50 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు ఎన్టీఏ తెలిపింది. అలాగే ప్రశ్నపత్రాలు, గోప్యమైన సమాచార భద్రత కోసం సుమారు 1,500 బ్యాంకు శాఖల్లో ప్రత్యేక అధికారులను నియమించారు. దేశవ్యాప్తంగా సుమారు 700 కేంద్రాల నుంచి ఓఎంఆర్ షీట్ల సేకరణ కోసం తపాలా శాఖ ప్రత్యేక బృందాలతో సమన్వయం చేస్తోంది. పరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించినట్లు ఎన్టీఏ వెల్లడించింది.
- Tags
- NEET
- NEET UG 2026 re exam
- NTA
తాజావార్తలు
-
Ajith Kumar: అజిత్తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
-
Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
-
Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
-
Alpha OTT: అలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!