NEET UG Re Exam 2026: నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్.. 1.3 లక్షల సీసీటీవీ కెమెరాలు, 51 వేల జామ్మర్లతో భద్రతా ఏర్పాట్లు
- నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్
- ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పరీక్ష నిర్వహించేందుకు విస్తృత భద్రతా ఏర్పాట్లు
- వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా నీట్-యూజీ (NEET-UG) పునఃపరీక్ష నేడు జరగనుంది. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పరీక్ష నిర్వహించేందుకు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ (NTA) వెల్లడించింది. సోషల్ మీడియాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రశ్నపత్రాల లీకేజీపై తప్పుడు ప్రచారం లేదా వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు కేవలం ఎన్టీఏ విడుదల చేసే అధికారిక సమాచారాన్నే నమ్మాలని సూచించింది. పరీక్ష నిర్వహణ సన్నాహాలను పరిశీలించేందుకు శనివారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆదివారం జరిగే పునఃపరీక్షకు 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు కొనసాగుతుంది.
Also Read
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్పింగ్.. బ్రిక్స్పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
పేపర్ లీకేజీ ఆరోపణలతో పరీక్ష రద్దు
ఈ ఏడాది మే 3న నిర్వహించాల్సిన నీట్-యూజీ పరీక్షను ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో మే 12న ఎన్టీఏ రద్దు చేసింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.
1.38 లక్షల సీసీటీవీ కెమెరాలు
దేశవ్యాప్తంగా 551 నగరాల్లోని 5,440 పరీక్షా కేంద్రాలు, విదేశాల్లోని 14 కేంద్రాల్లో పునఃపరీక్ష నిర్వహించనున్నారు. 95 వేలకుపైగా పరీక్షా గదుల్లో ప్రతి గదికి ఒక సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశారు. మొత్తం 1,38,560 సీసీటీవీ కెమెరాల ద్వారా పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. వీటి ఫీడ్లను జాతీయ, రాష్ట్ర, మంత్రిత్వ శాఖల స్థాయిలో అధికారులు పరిశీలిస్తారు.
51,311 జామర్లు ఏర్పాటు
ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఎలాంటి జోక్యం జరగకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా 51,311 జామర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా గదిలో ఇద్దరు ఇన్విజిలేటర్లను నియమించగా, ప్రతి కేంద్రంలో అదనంగా 10 మందికి పైగా సిబ్బందిని మోహరించారు. సీసీటీవీ ఫీడ్లను పర్యవేక్షించడం, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం ప్రతి కేంద్రంలో ఒక “సెంటర్ మానిటరింగ్ ఆఫీసర్” (CMO)ను నియమించారు.
భారీగా భద్రతా బలగాల మోహరింపు
పరీక్ష నిర్వహణ కోసం పోలీసు, పారామిలిటరీ దళాలు, భారత వైమానిక దళం, తపాలా శాఖ సిబ్బందితో పాటు రాష్ట్ర, జిల్లా పరిపాలనా యంత్రాంగాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సగటున 40 నుంచి 50 మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు ఎన్టీఏ తెలిపింది. అలాగే ప్రశ్నపత్రాలు, గోప్యమైన సమాచార భద్రత కోసం సుమారు 1,500 బ్యాంకు శాఖల్లో ప్రత్యేక అధికారులను నియమించారు. దేశవ్యాప్తంగా సుమారు 700 కేంద్రాల నుంచి ఓఎంఆర్ షీట్ల సేకరణ కోసం తపాలా శాఖ ప్రత్యేక బృందాలతో సమన్వయం చేస్తోంది. పరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించినట్లు ఎన్టీఏ వెల్లడించింది.
- Tags
- NEET
- NEET UG 2026 re exam
- NTA
తాజావార్తలు
-
Toxic OTT: బాక్సాఫీస్లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!