Lok sabha: ఎమర్జెన్సీపై 2 నిమిషాల మౌనం.. విపక్షాల ఆందోళన.. వాయిదా
- ఎమర్జెన్సీపై స్పీకర్ ఓం బిర్లా ప్రకటన
- 2 నిమిషాల ఎన్డీఏ సభ్యుల మౌనం
- విపక్షాల ఆందోళన.. గురువారానికి సభ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తొలిసారి లోక్సభలో స్పీకర్పై పోటీ నెలకొంది. ఎన్డీఏ కూటమిపై ఇండియా కూటమి పోటీ చేసింది. చివరికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికయ్యారు. మోడీ ప్రభుత్వంలో రెండోసారి ఓం బిర్లా స్పీకర్ స్థానంలో కూర్చున్నారు. అయితే ఓం బిర్లా.. స్పీకర్ సీటులో కూర్చోగానే ఇందిరాగాంధీ హయాం నాటి ఎమర్జెన్సీని గుర్తుచేసుకుని రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని ప్రకటించారు. దీంతో ఈ ప్రకటనతో విపక్షాలు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. స్పీకర్ ఓం బిర్లా తీరును తప్పుపట్టాయి. సభలో గందరగోళం నెలకొనడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.
ఇది కూడా చదవండి: Raashi Khanna: దాని కోసం ఎదురుచూస్తున్న.. హీరోయిన్ కీలక వ్యాఖ్యలు..
Also Read
అంతకముందు స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక కాగానే.. ఓం బిర్లాను స్పీకర్ సీటులోకి తీసుకెళ్లేందుకు ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ వెళ్లారు. ఈ సందర్భంగా మోడీ-రాహుల్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో సభలో సభ్యులు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. అయితే స్పీకర్ ప్రసంగంపై మాత్రం కాంగ్రెస్ సహా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఇది కూడా చదవండి: Kale vs Patnam Clashes: ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య వాగ్వాదం
ఓం బిర్లా ఏం మాట్లాడుతూ.. 1975, జూన్ 25 మన దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందన్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించారని గుర్తుచేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారన్నారు. ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టారని.. మీడియాపై ఆంక్షలు విధించారన్నారు. యావత్ దేశం కారాగారంగా మారిపోయిందని స్పీకర్ గుర్తుచేశారు. నాటి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించడాన్ని సభ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం అత్యయిక స్థితిని ఎదిరించిన వారిని తాము అభినందిస్తున్నామని ఓం బిర్లా అన్నారు. అనంతరం నాటి చీకటి రోజులకు నివాళిగా సభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటిద్దామని సభ్యులను కోరారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. స్పీకర్ మాట్లాడుతున్న సమయంలో మాత్రం కాంగ్రెస్ సహా విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: MIM MLA: జీహెచ్ఎంసీ సిబ్బందిపై ఎంఐఎం ఎమ్మెల్యే బూతు పురాణం.. వీడియో వైరల్..!
తాజావార్తలు
-
Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
-
El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
-
Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
-
TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
ట్రెండింగ్
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!