Aryan Khan: ఎన్సీబీ వెల్లడించిన సంచలన నిజాలు.. అమెరికాలోనే స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలనం సృష్టించిన క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ పొందిన బాలీవుడ్ సూపర్స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గురించి ఎన్సీబీ తాజాగా సంచలన విషయాలు బయటపెట్టింది. అమెరికాలో తాను గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పటి నుంచే గంజాయి తాగడం మొదలుపెట్టినట్టు స్వయంగా ఆర్యన్ అంగీకరించినట్టు ఎన్సీబీ తెలిపింది. ఆ సమయంలో తాను నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడేవాడినని, గంజాయితో ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఇంటర్నెట్లో చూసిన తర్వాతే తాను దాన్ని తీసుకోవడం ప్రారంభించానని ఆర్యన్ వెల్లడించినట్టు ఎన్సీబీ తన అభియోగపత్రంలో పేర్కొంది.
అయితే.. వినోదం కోసం లాస్ ఏంజెలెస్లో మరిజువానా తీసుకున్నానని, మాదకద్రవ్యాల గురించి తన ఫోన్లో వాట్సప్ ద్వారా చాట్ చేసింది కూడా తానేనని ఆర్యన్ ఒప్పుకున్నాడు. ముంబైలోని బాంద్రాలో తనకో డ్రగ్ డీల్ తెలుసని చెప్పిన ఆర్యన్.. అతని పేరు, చిరునామా మాత్రం పూర్తిస్థాయిలో తెలియదన్నాడు. ‘డోఖా’ పేరుతో మాదకద్రవ్యాల కొనుగోలు కోసం వాట్సప్లో చాట్ చేసినట్లు వెల్లడించాడు. అయితే.. క్రూజ్ నౌకపై దొరికిన మాదకద్రవ్యాలతో తనకెలాంటి సంబంధం లేదని ఆర్యన్ తెలిపినట్టు ఆ అభియోగపత్రంలో ఉంది. అంతేకాదు.. ఈ కేసులో క్లీన్ చిట్ పొందిన అర్బాజ్ మర్చంట్ సైతం, తనని క్రూజ్ నౌకలో డ్రగ్స్ తీసుకురావొద్దని ఆర్యన్ ముందుగానే హెచ్చరించినట్టు పేర్కొన్నాడు. డ్రగ్స్ గురించి అనన్యా పాండేతో 2019లో చాట్ చేసిన విషయం వాస్తవమేనని ఆర్యన్ ఒప్పుకోగా, అది కేవలం సరదా కోసమేనని అనన్యా క్లారిటీ ఇచ్చింది.
Also Read
- Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
- Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్చేస్తే..
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
మరోవైపు.. ఈ కేసు నుంచి ఆర్యన్ని విడిపించేందుకు షారుఖ్ నుంచి రూ. 25 కోట్లు అధికారులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఎన్సీబీ స్పష్టం చేసింది. తమకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని క్లారిటీ ఇచ్చింది. రూ. 25 కోట్లు డిమాండ్ చేసి, చివరికి రూ. 18 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారని.. అందులో రూ. 8 కోట్లు అప్పటి ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ అయిన సమీర్ వాంఖడేకి ఇవ్వాల్సి ఉంటుందని సామ్ డిసౌజ్ వ్యక్తితో తన యజమాని కేపీ గోసావి చెప్పడం చూశానని ప్రభాకర్ సాయిల్ అనే సాక్షి అప్పట్లో పేర్కొన్నాడు. దీనిపై దర్యాప్తు చేయగా.. ఆరోపణల్ని నిర్ధారించే సాక్ష్యాలేవీ లేవని ఎన్సీబీ నిర్ధారించింది. కాగా.. సాయిల్ ఈ ఏడాది ఏప్రిల్లో గుండెపోటుతో మరణించాడు.
తాజావార్తలు
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్తో డార్లింగ్ ఫ్యాన్స్లో టెన్షన్!
-
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
ట్రెండింగ్
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?