Chhattisgarh: బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. ఇరు వర్గాల మధ్య ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజాపూర్ పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ని భద్రత బలగాలు చేపడుతున్న సమయంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఘటన జరిగిన ప్రాంతం గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని పోలీస్ అధికారులు తెలిపారు.
హతమైన నక్సలైట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి హతమైన నక్సలైట్ల మృతదేహాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్, దంతేవాడ మరియు సుక్మా జిల్లాకు చెందిన 1200 మంది DRG, STF, COBRA మరియు CRPF సిబ్బంది నక్సల్ వ్యతిరేక ఆపరేషన్కు వెళ్లారు. ఉదయం 6 గంటల నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతోంది. అగ్రశ్రేణి నక్సల్స్ నేతలు ఉన్నారన్న సూచనతో ఈ ఆపరేషన్ను ప్రారంభించారు. బస్తర్ ఐజీ, మూడు జిల్లాల డీఐజీ, ఎస్పీలు ఆపరేషన్, ఎన్కౌంటర్పై నిఘా పెట్టారు. భద్రతా సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
Also Read
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
Read Also: Night Shifts: కేవలం 3 నైట్ షిఫ్టులు చాలు షుగర్, ఊబకాయం రావడానికి.. అధ్యయనంలో వెల్లడి..
గత కొన్ని రోజులుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ అణిచివేత కార్యక్రమాలు గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ 16న రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు 29 మంది నక్సలైట్లను హతమార్చాయి. దీంట్లో కీలకమైన మావోయిస్టు నేతలు మరణించారు. కాంకేర్ ఎన్కౌంటర్ తర్వాత సుక్మా జిల్లాలో ఆరుగురు నక్సలైట్లు లొంగిపోయారు. వీరందరిపై రూ. 36 లక్షలు రివార్డు ఉంది. ఏప్రిల్ 29న 23 మంది, ఏప్రిల్ 15న 26 మంది నక్సలైట్లు లొంగిపోయారు.
#WATCH | Chhattisgarh CM Vishnu Deo Sai says, "An encounter broke out with the Naxals in Gangaloor area of Bijapur district…12 dead bodies of the Naxals have been found. I congratulate our jawans & senior officers…" https://t.co/OXMg9oAXUO pic.twitter.com/I9woGLlGRf
— ANI (@ANI) May 10, 2024
తాజావార్తలు
-
Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!