Chhattisgarh: బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. ఇరు వర్గాల మధ్య ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజాపూర్ పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ని భద్రత బలగాలు చేపడుతున్న సమయంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఘటన జరిగిన ప్రాంతం గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని పోలీస్ అధికారులు తెలిపారు.
హతమైన నక్సలైట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి హతమైన నక్సలైట్ల మృతదేహాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్, దంతేవాడ మరియు సుక్మా జిల్లాకు చెందిన 1200 మంది DRG, STF, COBRA మరియు CRPF సిబ్బంది నక్సల్ వ్యతిరేక ఆపరేషన్కు వెళ్లారు. ఉదయం 6 గంటల నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతోంది. అగ్రశ్రేణి నక్సల్స్ నేతలు ఉన్నారన్న సూచనతో ఈ ఆపరేషన్ను ప్రారంభించారు. బస్తర్ ఐజీ, మూడు జిల్లాల డీఐజీ, ఎస్పీలు ఆపరేషన్, ఎన్కౌంటర్పై నిఘా పెట్టారు. భద్రతా సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
Also Read
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
Read Also: Night Shifts: కేవలం 3 నైట్ షిఫ్టులు చాలు షుగర్, ఊబకాయం రావడానికి.. అధ్యయనంలో వెల్లడి..
గత కొన్ని రోజులుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ అణిచివేత కార్యక్రమాలు గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ 16న రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు 29 మంది నక్సలైట్లను హతమార్చాయి. దీంట్లో కీలకమైన మావోయిస్టు నేతలు మరణించారు. కాంకేర్ ఎన్కౌంటర్ తర్వాత సుక్మా జిల్లాలో ఆరుగురు నక్సలైట్లు లొంగిపోయారు. వీరందరిపై రూ. 36 లక్షలు రివార్డు ఉంది. ఏప్రిల్ 29న 23 మంది, ఏప్రిల్ 15న 26 మంది నక్సలైట్లు లొంగిపోయారు.
#WATCH | Chhattisgarh CM Vishnu Deo Sai says, "An encounter broke out with the Naxals in Gangaloor area of Bijapur district…12 dead bodies of the Naxals have been found. I congratulate our jawans & senior officers…" https://t.co/OXMg9oAXUO pic.twitter.com/I9woGLlGRf
— ANI (@ANI) May 10, 2024
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..