Nawaz Sharif: “కార్గిల్ యుద్ధాన్ని వద్దన్నందుకే నన్ను తొలగించారు”.. పాక్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nawaz Sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) అధినేత నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో జరిగిన కార్గిల్ యుద్ధాన్ని ఉద్దేశించి ఆరోపణలు చేశారు. భారతదేశంతో సత్సంబంధాల ప్రాముఖ్యతను చెప్పినందుకు, కార్గిల్ ప్లాన్ వ్యతిరేకించినందుకు అప్పటి జనరల్ పర్వేజ్ ముషారప్ 1999లో తన ప్రభుత్వాన్ని దించేశారని శనివారం అన్నారు. మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన తనను ముందస్తుగా ప్రధాని పదవి నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించారు.
‘‘ నేను 1993, 1999లో ఎందుకు ప్రధాని పదవి నుంచి తొలగించబడ్డానో చెప్పాలి. నేను కార్గిల్ ప్లాన్ని వ్యతిరేకించినప్పుడు, నన్ను(జనరల్ పర్వేజ్ ముషారఫ్) పదవీ నుంచి దింపేశాడు. ఆ తర్వాత నేను చెప్పింది నిజమే అని తేలింది.’’ అని షరీఫ్ అన్నారు. వచ్చే ఫిబ్రవరిలో పాక్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ప్రధాని పదవికి నవాజ్ షరీఫ్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులతో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
షరీఫ్ పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఇద్దరు భారత ప్రధానులు పాకిస్తాన్లో పర్యటించారు. దీనిని గురించి ఆయన మాట్లాడారు. వాజ్పేయి, నరేంద్రమోడీ లాహోర్ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నవాజ్ భారతదేశంతో సంబంధాల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలతో మన సంబంధాలు బలపరుచుకోవాలి, చైనాతో మరింత బలమైన సంబంధాలను ఏర్పరుచుకోవాలి అని షరీఫ్ అన్నారు.
Read Also: Hyderabad: పెళ్లి కావడం లేదని మనస్తాపంతో యువకుడు సూసైడ్
ఆర్థిక వృద్ధిలో పాక్ పొరుగుదేశాల కన్నా వెనకబడి ఉందని ఆయన విచారం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై విరుచుకుపడిన షరీఫ్.. అనుభవం లేని వ్యక్తి దేశ పగ్గాలు ఎందుకు ఇచ్చారో తెలియడం లేదని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ హయాంతో పాక్ ఆర్థిక వ్యవస్థ పతానానికి గురైందని, ఆ తర్వాత షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం గద్దెనెక్కి దేశాన్ని డిఫాల్ట్ నుంచి రక్షించిందని ఆయన అన్నారు. 2017లో తన ప్రభుత్వాన్ని దించేసి దేశాన్ని నాశనం చేసినందుకు మాజీ సైనిక జనరల్స్, న్యాయమూర్తులు జవాబుదారీ వహించాలని షరీఫ్ డిమాండ్ చేశారు. దేశ భక్తి ఉన్న వారు తమ దేశాన్ని ఇలా చేయరని మండిపడ్డారు.
విలాసవంతమైన కార్లలో తిరిగేందుకు తాను అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని, అయితే దేశాన్ని నాశనం చేసిన వారు, తనపై తప్పుడు కేసులు బనాయించి వారు జవాబుదారీగా ఉండాలన్నారు. యూకేలో 4 ఏళ్లు ప్రవాసంలో గడిపిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవల సొంత దేశానికి వచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ టిక్కెట్ల కోసం షరీఫ్ ప్రతిరోజూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
-
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!