Nawaz Sharif: “కార్గిల్ యుద్ధాన్ని వద్దన్నందుకే నన్ను తొలగించారు”.. పాక్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nawaz Sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) అధినేత నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో జరిగిన కార్గిల్ యుద్ధాన్ని ఉద్దేశించి ఆరోపణలు చేశారు. భారతదేశంతో సత్సంబంధాల ప్రాముఖ్యతను చెప్పినందుకు, కార్గిల్ ప్లాన్ వ్యతిరేకించినందుకు అప్పటి జనరల్ పర్వేజ్ ముషారప్ 1999లో తన ప్రభుత్వాన్ని దించేశారని శనివారం అన్నారు. మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన తనను ముందస్తుగా ప్రధాని పదవి నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించారు.
‘‘ నేను 1993, 1999లో ఎందుకు ప్రధాని పదవి నుంచి తొలగించబడ్డానో చెప్పాలి. నేను కార్గిల్ ప్లాన్ని వ్యతిరేకించినప్పుడు, నన్ను(జనరల్ పర్వేజ్ ముషారఫ్) పదవీ నుంచి దింపేశాడు. ఆ తర్వాత నేను చెప్పింది నిజమే అని తేలింది.’’ అని షరీఫ్ అన్నారు. వచ్చే ఫిబ్రవరిలో పాక్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ప్రధాని పదవికి నవాజ్ షరీఫ్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులతో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
షరీఫ్ పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఇద్దరు భారత ప్రధానులు పాకిస్తాన్లో పర్యటించారు. దీనిని గురించి ఆయన మాట్లాడారు. వాజ్పేయి, నరేంద్రమోడీ లాహోర్ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నవాజ్ భారతదేశంతో సంబంధాల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలతో మన సంబంధాలు బలపరుచుకోవాలి, చైనాతో మరింత బలమైన సంబంధాలను ఏర్పరుచుకోవాలి అని షరీఫ్ అన్నారు.
Read Also: Hyderabad: పెళ్లి కావడం లేదని మనస్తాపంతో యువకుడు సూసైడ్
ఆర్థిక వృద్ధిలో పాక్ పొరుగుదేశాల కన్నా వెనకబడి ఉందని ఆయన విచారం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై విరుచుకుపడిన షరీఫ్.. అనుభవం లేని వ్యక్తి దేశ పగ్గాలు ఎందుకు ఇచ్చారో తెలియడం లేదని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ హయాంతో పాక్ ఆర్థిక వ్యవస్థ పతానానికి గురైందని, ఆ తర్వాత షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం గద్దెనెక్కి దేశాన్ని డిఫాల్ట్ నుంచి రక్షించిందని ఆయన అన్నారు. 2017లో తన ప్రభుత్వాన్ని దించేసి దేశాన్ని నాశనం చేసినందుకు మాజీ సైనిక జనరల్స్, న్యాయమూర్తులు జవాబుదారీ వహించాలని షరీఫ్ డిమాండ్ చేశారు. దేశ భక్తి ఉన్న వారు తమ దేశాన్ని ఇలా చేయరని మండిపడ్డారు.
విలాసవంతమైన కార్లలో తిరిగేందుకు తాను అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదని, అయితే దేశాన్ని నాశనం చేసిన వారు, తనపై తప్పుడు కేసులు బనాయించి వారు జవాబుదారీగా ఉండాలన్నారు. యూకేలో 4 ఏళ్లు ప్రవాసంలో గడిపిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవల సొంత దేశానికి వచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ టిక్కెట్ల కోసం షరీఫ్ ప్రతిరోజూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Vastu Tips: మనీ ప్లాంట్ను ఈ దిశలో పెడితే ధన యోగం వస్తుందా?.. వాస్తు నిపుణులు చెప్పే సూచనలు ఇవే
-
Indian Army: అరుణాచల్లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!