National Flag Honors: దెబ్బతిన్న జాతీయ జెండాను ఎలా గౌరవంగా పారేయాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How to dispose damaged Indian national flag with dignity: భారత దేశం బ్రిటీష్ వారి వలస పాలన నుంచి విముక్తి పొంది 75 ఏళ్లు అవుతోంది. దీంతో ఈ సారి స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను దేశం మొత్తం ఘనంగా నిర్వహించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం 75 ఏళ్ల స్వాతంత్రానికి గుర్తుగా ‘ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, ‘ హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరేసి గర్వంతో ఉప్పొంగిపోతున్నాము. సోషల్ మీడియాలో జాతీయ జెండాతో డీపీలు, సెల్ఫీలు దిగి గర్వంతో మురిసిపోతున్నాము. అయితే ఇదంతా బాగుంది కానీ.. అసలు జాతీయ జెండాను ఎలా గౌరవించాలనే విషయాలు మాత్రం మరిచిపోతున్నాము. ఆగస్టు 15 ముగిసిన తర్వాత జాతీయ జెండాకు జరుగుతున్న అవమానాల గురించి చాలా సార్లు మనం వింటూనే ఉన్నాము. రోడ్డు పక్కన, చెత్త కుప్పల్లో జాతీయ జెండాను పడేయడం మనకు కనిపిస్తుంటాయి. ఆగస్టు 15 ముందు వరకు ఉన్న గౌరవం ఒక్కసారిగా తొలిగిపోవడం చూస్తుంటాం.
అయితే జాతీయ జెండాను అగౌరవపరచడం నేరం అని మనలో ఎంత మందికి తెలుసు..? ముఖ్యంగా వేడుకలు ముగిసిన తర్వాత చిరిగిన, దెబ్బతిన్న జాతీయ పతాకాన్ని ఎంత గౌరవంగా పారేయాలనేది చాలా మందికి తెలియదు. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2022లో పేర్కొన్న నిబంధనల ప్రకారం దెబ్బతిన్న జాతీయ పతకాన్ని రెండు పద్దతుల ద్వారా గౌరవంగా పారేయాలి. దహనం చేయడం లేదా పాతి పెట్టడం ద్వారా గౌరవంగా పారేయాలి.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: Jammu Kashmir: కాశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్చ.. గ్రెనేడ్ దాడి పోలీస్ మృతి
ఈ రెండు పద్ధతుల్లో జాతీయ జెండాను పారవేసే సమయంలో కూడా కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. జెండాను పాతిపెట్టడానికి ముందు జాతీయ జెండాను ఓ చెక్క పెట్టలో సేకరించాలి. జెండాను మడతపెట్టి పెట్టెలో పెట్టి భూమిలో పాతిపెట్టాలి. జెండాను పాతిపెట్టిన తర్వాత ఒక క్షణం పాటు మౌనం పాటించాలి.ఇక రెండో పద్ధతిలో దహనం చేసే సమయంలో కూడా కఠిన నిబంధనలు పాటించాలి. జెండాను అగ్నిలో కాల్చివేసే సమయంలో.. ఆ చోటును శుభ్రం చేయాలి. అగ్నిని ముందుగా ఏర్పాటు చేసి మంటల మధ్య జెండాను జాగ్రత్తగా మంటల మధ్య ఉంచి కాల్చాలి. జెండాను మడతపెట్టకుండా.. ముందుగా అగ్నిని నిర్మించకుండా కాల్చిడం, జెండాకు ముందుగా నిప్పు పెట్టడం నేరాలుగా భావించాల్సి ఉంటుంది. జాతీయ జెండా మన దేశాని గర్వకారణం..దానిని పారేసేటప్పుడు కూడా ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది.
ప్లాస్టిక్తో తయారు చేసిన భారత జాతీయ జెండాను ఉపయోగించకుండా ఉండాలని ప్రతి ఒక్కరినీ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది మరియు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు ఫ్లాగ్ కోడ్ను ఖచ్చితంగా పాటించాలని కోరింది. ఈ స్వాతంత్ర్య దినోత్సవం, భారత జాతీయ జెండాను పారవేసే నియమాలను అనుసరించడం ద్వారా భారతదేశ జాతీయ జెండా గౌరవించాలి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!