NCRB Report: ఎక్కువ అత్యాచారాలు ఆ రాష్ట్రాల్లోనే.. ఎన్సీఆర్బీ నివేదికలో కీలక విషయాలు
National Crime Records Bureau (NCRB) report On Woman Molestation: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దేశంలో వివిధ నేరాలపై నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసుల వివరాలు, క్రైమ్ రేట్ మొదలైన వివరాలను నివేదిక బహిర్గతపరిచింది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం దేశంలో అత్యధికంగా అత్యాచారా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాలే ఉన్నాయి. ఏడాది కాలంలో అత్యధికంగా రాజస్థాన్ రాష్ట్రంలో అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. రాజస్థాన్ తరువాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలు ఉన్నాయి.
2021లో రాజస్థాన్ లో మొత్తం 6,337 అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. ఇది 2020తో నమోదైన 5,310 కేసుల కన్నా 19.34 శాతం ఎక్కువగా. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2,947 అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ లో 2,845, మహారాష్ట్రలో 2,496 అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. అయితే అన్ని రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్ లో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. గతేడాది పలు కీలకమైన అత్యాచార కేసులు రాజస్థాన్ లోనే బయటపడ్డాయి. 2021లో రాజస్థాన్ లో 1,452 అత్యాచారాలు కేసులు మైనర్లకు సంబంధించినవి కాగా.. 60 ఏళ్లకు పైబడిన వారిపై అత్యాచారం చేసిన ఘటనలు నాలుగు ఉన్నాయి. అత్యాచారం కేసుల్లో సగానికి పైగా తెలిసిన వారు, అదే కుటుంబానికి చెందిన వారు, పొరుగువారే నుంచే జరిగాయి. మహిళలకు, పిల్లలకు బాగా తెలిసిన వ్యక్తులే అత్యాచారాలకు పాల్పడినట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది.
Also Read
Read Also: Revanth Reddy: మోదీ తెలంగాణను, కేసీఆర్ దేశాన్ని ఆక్రమించేందుకు బయల్దేరారు
రాజస్థాన్ లో షెడ్యూల్ కులాలు, తెగల్లో అత్యాచార కసులు పెరిగాయని నివేదిక వెల్లడించింది. ఇక ఉత్తర్ ప్రదేశ్ మహిళలపై నేరాల విషయంలో రెండో స్థానంలో ఉంది. గతంలో మహిళపై లైంగిక పరమైన నేరాల్లో ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చే వారు కాదు..అయితే ఇటీవల తమకు జరిగిన అన్యాయంపై మహిళలు కేసులు నమోదు చేస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రెహానా రియాజ్ మాట్లాడుతూ.. మహిళలపై నేరాలు పెరగడం ఆందోళనకరం అని.. అయితే దర్యాప్తులో చాలా కేసులు నకిలీవి అని తేలిందని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో