Nagaland: నాగాలాండ్ రాష్ట్రంలో వందేళ్ల తరువాత రెండో రైల్వే స్టేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagaland Gets Its 2nd Railway Station After A Gap Of Over 100 Years: ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే కనెక్టివిటీ అంతంత మాత్రంగానే ఉంటుంది. మొత్తం కొండలు, గుట్టలు, వాగులు, నదులతో ఉండే భౌగోళిక స్వరూపం రైల్వే నిర్మాణానికి ప్రతిబంధకంగా మారుతుంది. దీంతో ఈశాన్య రాష్ట్రాలు రైల్ అనుసంధానంలో వెనకబడి ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈశాన్య రాష్ట్రాలను ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు రైల్వే ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. దీంట్లో భాగంగానే నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణాన్ని చేపడుతోంది.
ఇదిలా ఉంటే దాదాపుగా 100 ఏళ్ల తరువాత నాగాలాండ్ రాష్ట్రంలో రెండో రైల్వే స్టేషన్ ప్రారంభించారు. శోఖువి రైల్వే స్టేషన్ ను నాగాలాండ్ ముఖ్యమంత్రి నిఫియో రియో శుక్రవారం ప్రారంభించారు. శోఖువి నుంచి డోనీ పోలో ఎక్స్ప్రెస్ రైల్ ను జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు నాగాాలాండ్ రాష్ట్రంలో కేవలం ఒకే రైల్వే స్టేషన్ ఉంది. నాగాలాండ్ వాణిజ్య రాజధాని దిమాపూర్ లో 1903లో రైల్వే స్టేషన్ నిర్మించారు. దాదాపుగా వందేళ్ల తరువాత శోఖువి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. డోనీ పోలో ఎక్స్ప్రెస్ అస్సాం గౌహతి నుంచి అరుణాచల్ ప్రదేశ్ నహర్లాగన్ మధ్య నడుస్తుంది. అయితే ఈ రైలును ప్రస్తుతం శోఖువి వరకు పొడగించారు. దీంతో నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు రైలు మార్గం ద్వారా అనుసంధానించబడినట్లు అయింది.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
‘‘ ఈరోజు నాగాలాండ్కు చారిత్రాత్మకమైన రోజు. ధనసరి-శోఖువి రైల్వే మార్గం 100 ఏళ్ల తరువాత రెండో స్టేషన్ గా రైల్ సేవలను పొందింది’’ అంటూ నాగాలాండ్ ముఖ్యమంత్రి నిఫియో రియో ట్వీట్ చేశారు. ఈ రైల్వే స్టేషన్ వల్ల నాగాలాండ్ ప్రజలకు మాత్రమే కాకుండా.. మణిపూర్, అస్సాంలోని పొరుగు జిల్లాల ప్రజలు కూడా లాభం పొందనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని అన్ని రాష్ట్రాల రాజధానులను అనుసంధానం చేసేందుకు భారతీయ రైల్వేలు, ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే కృషి చేస్తోందని జనరల్ మేనేజర్ అన్షుల్ గుప్తా అన్నారు. అస్సాంలోని ధన్ సిరి నుంచి నాగాలండ్ కోహిమా జిల్లాలోని జుబ్జా వరకు 90 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ మార్గానికి 2016లో శంకుస్థాపన చేశారు.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. దీని నిర్మాణ గడువును 2020 నుంచి 2024 వరకు పొడగించారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!