Uttar Pradesh: హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి వివాహం.. పోలీసులే పెళ్లి పెద్దలు..
- యూపీలో వైరల్గా హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి వివాహం..
- ఇరు కుటుంబాలతో 6 గంటల పాటు చర్చించి ఒప్పించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి పెళ్లి వైరల్గా మారింది. ఈ మతాంతర వివాహం ముందుగా రెండు వర్గాల్లో ఉద్రిక్తలు పెంచినప్పటికీ, చివరకు అమ్మాయి తండ్రి వివాహానికి ఒప్పుకోవడంతో శుభం కార్డ్ పడింది. మొత్తం ఈ వివాహంలో పోలీసులు పెళ్లి పెద్దలుగా నిలిచారు. ముస్లిం యువతి సానియా బానో, హిందూ యువకుడు అమన్ కుమార్ల కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. దావూద్పూర్ గ్రామానికి చెందిన ఇరు కుటుంబాలు ఇరుగుపొరుగున ఉంటాయి. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ముందుగా విషయం తెలుసుకున్న సానియా బానో తండ్రి ఖుర్షీద్ ఆలం పెళ్లికి నిరాకరించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్కు పిలిచి, దాదాపుగా 6 గంటల పాటు చర్చించి, ఇరు పక్షాలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. చివరకు తన కుమార్తె సంతోషమే ముఖ్యమని భావించిన ఖుర్షీద్ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని తర్వాత సానియా, అమన్ సమీపంలోని ఆలయంలో హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. తన ఇష్టపూర్వకంగానే అమన్ను పెళ్లి చేసుకున్నట్లు సానియా అఫిడవిట్ సమర్పించింది. భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా నోటరీ అఫిడవిట్ కూడా సిద్ధం చేశారు. గ్రామానికి చెందిన ఖుర్షీద్ ఆలం, అమర్ బహదూర్ ఈ వివాహానికి సాక్షులుగా నిలిచారు.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ఈ అంతర్-మత వివాహం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. వివాహ వేడుకకు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్లకు చెందిన అధికారులు, కార్యకర్తలు కూడా హాజరైనట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి మనీష్కుమార్ రావత్, బీజేపీ నేత విజయ్సింగ్ బజరంగీ, బజరంగ్ దళ్ జిల్లా సమన్వయకర్త ప్రిన్స్ బర్వాల్, శివకుమార్ సోని, కృష్ణపాల్, బబ్లూ గౌతమ్, నన్హే గౌతమ్, రాజేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!