Uttar Pradesh: హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి వివాహం.. పోలీసులే పెళ్లి పెద్దలు..
- యూపీలో వైరల్గా హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి వివాహం..
- ఇరు కుటుంబాలతో 6 గంటల పాటు చర్చించి ఒప్పించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి పెళ్లి వైరల్గా మారింది. ఈ మతాంతర వివాహం ముందుగా రెండు వర్గాల్లో ఉద్రిక్తలు పెంచినప్పటికీ, చివరకు అమ్మాయి తండ్రి వివాహానికి ఒప్పుకోవడంతో శుభం కార్డ్ పడింది. మొత్తం ఈ వివాహంలో పోలీసులు పెళ్లి పెద్దలుగా నిలిచారు. ముస్లిం యువతి సానియా బానో, హిందూ యువకుడు అమన్ కుమార్ల కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. దావూద్పూర్ గ్రామానికి చెందిన ఇరు కుటుంబాలు ఇరుగుపొరుగున ఉంటాయి. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ముందుగా విషయం తెలుసుకున్న సానియా బానో తండ్రి ఖుర్షీద్ ఆలం పెళ్లికి నిరాకరించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్కు పిలిచి, దాదాపుగా 6 గంటల పాటు చర్చించి, ఇరు పక్షాలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. చివరకు తన కుమార్తె సంతోషమే ముఖ్యమని భావించిన ఖుర్షీద్ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని తర్వాత సానియా, అమన్ సమీపంలోని ఆలయంలో హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. తన ఇష్టపూర్వకంగానే అమన్ను పెళ్లి చేసుకున్నట్లు సానియా అఫిడవిట్ సమర్పించింది. భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా నోటరీ అఫిడవిట్ కూడా సిద్ధం చేశారు. గ్రామానికి చెందిన ఖుర్షీద్ ఆలం, అమర్ బహదూర్ ఈ వివాహానికి సాక్షులుగా నిలిచారు.
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
ఈ అంతర్-మత వివాహం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. వివాహ వేడుకకు బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్లకు చెందిన అధికారులు, కార్యకర్తలు కూడా హాజరైనట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి మనీష్కుమార్ రావత్, బీజేపీ నేత విజయ్సింగ్ బజరంగీ, బజరంగ్ దళ్ జిల్లా సమన్వయకర్త ప్రిన్స్ బర్వాల్, శివకుమార్ సోని, కృష్ణపాల్, బబ్లూ గౌతమ్, నన్హే గౌతమ్, రాజేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!