Mumbai Hit-And-Run: ముంబైలో హిట్ అండ్ రన్ కేసు.. శివసేన (షిండే) నాయకుడు కొడుకు కోసం గాలింపు..!
- ముంబైలో సంచలనం రేపుతున్న హిట్ అండ్ రన్ కేసు..
- షిండే వర్గం నేత రాజేశ్ షా కుమారుడి కోసం పోలీసుల గాలింపు..
- రాజేశ్ షా.. డ్రైవర్లను కోర్టులో ప్రవేశ పెట్టిన ముంబై పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Hit-And-Run: మహారాష్ట్రలో జరిగిన బీఎండబ్ల్యూ కారు ప్రమాదం కేసులో నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ప్రమాదానికి కారణమైన మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెందిన శివసేన (షిండే) వర్గానికి చెందిన లీడర్ రాజేష్ షా కుమారుడు మిహిర్ షా కోసం గాలిస్తున్నారు. అయితే, ప్రమాదం జరిగే సమయంలో మిహిర్ షానే కారుని నడిపినట్లు తేలింది. యాక్సిడెంట్ చేసిన తర్వాత నిందితుడు పరార్ కావడంతో.. అతడి కోసం ఆరు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఘటన జరిగిన టైంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇప్పటికే, మిహిర్ షాపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడంతో పాటు అతడి ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు చెప్పుకొచ్చారు. నిందితుడి తల్లి, సోదరి ఆచూకీ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
Read Also: Dark Chocolate Benefits: మీరు ఆర్యోగ్యంగా ఉండాలనుకుంటున్నారా?.. అయితే ఈ చాక్లెట్ తినాల్సిందే!
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
అయితే, నిందితుడి తండ్రి రాజేష్ షా, అతని డ్రైవర్ రాజరుషి బిదావత్లను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం జరగ్గా.. సాయంత్రం ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పోలీసులకు సహకరించకపోవడం వల్లే శివసేన నేత రాజేష్ షాను అరెస్టు చేసినట్లు చెప్పుకొచ్చారు. నిందితుడు రాజకీయ నేత కుమారుడు కావడంతో ఒక్కసారిగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. ఇకపోతే, నిందితుడిపై కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం.. నేరపూరిత హత్య, ర్యాష్ డ్రైవింగ్, సాక్ష్యాలు నాశనం చేయడం లాంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు రాజేష్ షా పేరుతో ఉండటంతో పాటు ప్రమాదం జరిగాక నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ట్రై చేసినట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!