UP: యూపీలో దారుణం.. మేనకోడలు మరొకర్ని పెళ్లి చేసుకుంటుందని హత్య
- యూపీ హర్దోయ్లో దారుణం
- మేనకోడలు మరొకర్ని పెళ్లి చేసుకుంటుందని హత్య
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఏదొక చోట మహిళలు బలైపోతున్నారు. ఇప్పటికే మహిళలపై అత్యాచారాలు చేసి ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా యూపీలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 22 ఏళ్ల మేనకోడలను చంపేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హర్దోయ్లో జరిగింది.
వరుసకు మేనకోడలైన 22 ఏళ్ల మాన్సీ పాండే అనే యువతితో రెండేళ్ల నుంచి మణికాంత్ ద్వివేది అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఈ మధ్య ఆమె మరొకరిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. దీంతో మణికాంత్.. ఆమెపై పగ పెట్టుకున్నాడు. అంతే అదునుచూసి ఆమెను అంతమొందించాడు. అనంతరం నిర్మాణంలో ఉన్న భవనంలో మృతదేహాన్ని పడేశాడు. పోలీసులను తప్పు దోవ పట్టించేందుకు ఆమె సెల్ఫోన్ను బస్సులో విసిరేశాడు.
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
మాన్సీ పాండే కనిపించడం లేదని ఆమె తండ్రి రాంసాగర్ పాండేకు మణికాంత్ ఫోన్ చేసి చెప్పాడు. అయితే రాంసాగర్కు మణికాంత్పై అనుమానం కలిగింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రక్షాబంధన్ రోజున అనగా.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మణికాంత్ ఇంటి దగ్గర మాన్సీని దింపినట్లు బాధితురాలి తండ్రి రాంసాగర్ పాండే తెలిపాడు. ‘‘మేము మా స్వగ్రామానికి వెళ్ళాము. తరువాత నేను లక్నో వెళ్ళాను. బుధవారం అతను (మణికాంత్) నాకు ఫోన్ చేసి.. మాన్సీ కనిపించడంలేదని మరియు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పాడు. మాన్సీ పారిపోయిందని అతను నాకు చెప్పాడు, కానీ నేను అతనిని అనుమానించి..పోలీసులకు ఫిర్యాదు చేశాను.’’ అని రాంసాగర్ తెలిపాడు.
పోలీసులు కేసు నమోదు చేసి మణికాంత్ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ జరిపారు. దీంతో నిందితుడు మణికాంత్ నేరాన్ని అంగీకరించాడు. మాన్సీతో తనకు రెండేళ్ల నుంచి సంబంధం ఉందని.. అయితే తాను వేరొకరని పెళ్లి చేసుకోబోతుందని చెప్పిందన్నాడు. ఆ కోపంతో ఆమెను చంపేసినట్లు తెలిపాడు. మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న భవనంలో పడేసి.. ఫోన్ను బస్సులో పడేసినట్లు తెలిపాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో