UP: యూపీలో దారుణం.. మేనకోడలు మరొకర్ని పెళ్లి చేసుకుంటుందని హత్య
- యూపీ హర్దోయ్లో దారుణం
- మేనకోడలు మరొకర్ని పెళ్లి చేసుకుంటుందని హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఏదొక చోట మహిళలు బలైపోతున్నారు. ఇప్పటికే మహిళలపై అత్యాచారాలు చేసి ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా యూపీలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 22 ఏళ్ల మేనకోడలను చంపేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హర్దోయ్లో జరిగింది.
వరుసకు మేనకోడలైన 22 ఏళ్ల మాన్సీ పాండే అనే యువతితో రెండేళ్ల నుంచి మణికాంత్ ద్వివేది అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఈ మధ్య ఆమె మరొకరిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. దీంతో మణికాంత్.. ఆమెపై పగ పెట్టుకున్నాడు. అంతే అదునుచూసి ఆమెను అంతమొందించాడు. అనంతరం నిర్మాణంలో ఉన్న భవనంలో మృతదేహాన్ని పడేశాడు. పోలీసులను తప్పు దోవ పట్టించేందుకు ఆమె సెల్ఫోన్ను బస్సులో విసిరేశాడు.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్డ్రింక్తో హత్య
మాన్సీ పాండే కనిపించడం లేదని ఆమె తండ్రి రాంసాగర్ పాండేకు మణికాంత్ ఫోన్ చేసి చెప్పాడు. అయితే రాంసాగర్కు మణికాంత్పై అనుమానం కలిగింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రక్షాబంధన్ రోజున అనగా.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మణికాంత్ ఇంటి దగ్గర మాన్సీని దింపినట్లు బాధితురాలి తండ్రి రాంసాగర్ పాండే తెలిపాడు. ‘‘మేము మా స్వగ్రామానికి వెళ్ళాము. తరువాత నేను లక్నో వెళ్ళాను. బుధవారం అతను (మణికాంత్) నాకు ఫోన్ చేసి.. మాన్సీ కనిపించడంలేదని మరియు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని చెప్పాడు. మాన్సీ పారిపోయిందని అతను నాకు చెప్పాడు, కానీ నేను అతనిని అనుమానించి..పోలీసులకు ఫిర్యాదు చేశాను.’’ అని రాంసాగర్ తెలిపాడు.
పోలీసులు కేసు నమోదు చేసి మణికాంత్ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ జరిపారు. దీంతో నిందితుడు మణికాంత్ నేరాన్ని అంగీకరించాడు. మాన్సీతో తనకు రెండేళ్ల నుంచి సంబంధం ఉందని.. అయితే తాను వేరొకరని పెళ్లి చేసుకోబోతుందని చెప్పిందన్నాడు. ఆ కోపంతో ఆమెను చంపేసినట్లు తెలిపాడు. మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న భవనంలో పడేసి.. ఫోన్ను బస్సులో పడేసినట్లు తెలిపాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!