Muhammad Yunus: భారత్తో మాకు సమస్యలు.. బంగ్లాదేశ్ యూనస్..
- భారత్తో మాకు సమస్యలు ఉన్నాయి..
- విద్యార్థి ఉద్యమం, షేక్ హసీనా పదవి కోల్పోవడం వారికి నచ్చలేదు..
- బంగ్లాదేశ్ తాత్కాలిక నేత మహ్మద్ యూనస్ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muhammad Yunus: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ మరోసారి భారత్పై తన అక్కసును వెళ్లగక్కాడు. న్యూయార్క్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. గతేడాది బంగ్లాదేశ్ వ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనను, షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావడాన్ని భారత్ ఇష్టపడలేదని ఆయన అన్నారు. దీని వల్ల భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బతిన్నట్లు చెప్పుకొచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సందర్భంగా న్యూయార్క్లో సార్క్ (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్)ను పునరుద్ధరించడం గురించి యూనస్ మాట్లాడారు.
Read Also: CM Chandrababu: “మీ కోరిక తీరింది.. నా కల నెరవేర్చండి”.. కొత్త టీచర్లకు సీఎం కీలక సూచన..
Also Read
- Nepal Flash Floods: నేపాల్లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
‘‘విద్యార్థులు చేసింది వారికి నచ్చకపోవచ్చు. ప్రస్తుతం, భారత్తో మాకు సమస్యలు ఉన్నాయి’’ అని అన్నారు. భారత మీడియా కొన్ని తప్పుడు నివేదికలు పరిస్థితిని మరింత దిగజార్చాయని ఆరోపించారు. భారతదేశం నుంచి చాలా నకిలీ వార్తలు వస్తున్నాయని, అది ఇస్లామిక్ ఉద్యమం అని ప్రచారం జరుగుతోందని అన్నారు. బంగ్లాదేశ్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్వేచ్ఛగా, న్యాయంగా, శాంతియుతంగా సార్వత్రిక ఎన్నికలు జరిగేలా తాత్కిలిక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
భారతదేశం షేక్ హసీనాకు ఆశ్రయం ఇస్తోందని, ఇది బంగ్లాదేశ్-భారత్ మధ్య ఉద్రిక్తతల్ని సృష్టిస్తోందని ఆరోపించారు. సార్క్ పునరుద్ధరించడంలో యూనస్ భారత్ని లక్ష్యంగా చేసుకున్నారు. దక్షిణ-మధ్య ఆసియా ప్రత్యేక యూఎస్ రాయబారి, భారతదేశంలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్తో సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, గతేడాది బంగ్లాదేశ్ అల్లర్లలో హిందువులపై అత్యాచారాలు, హత్యలు, ఆస్తుల్ని తగలబెడుతున్నా యూనస్ సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. ఆయన ప్రభుత్వంలోని కొందరు భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామని ప్రగల్భాలు పలికారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
తాజావార్తలు
-
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
-
Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
-
Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్లో వరద విలయం.. 105 మంది భారతీయులు గల్లంతు..
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..