Saibaba Temple: సాయి పాదాలమీదే ప్రాణాలు వదిలాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saibaba Temple: చావు ఎప్పుడు ఏ క్షణాల మనిషికి ప్రాణాలు తీసుకుంటుందో తెలియని అయోమయం. మాట్లాడుతున్న, డ్యాన్స్ చేస్తున్న ఏ క్షణాన మృత్యువు తన ఓడికి చేర్చుకుంటుందో తెలియదు. ఇలాంటి ఘటనలు మనం తరుచూ చూస్తున్నాము. సాయిబాబా ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రార్థనలు చేస్తూ మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఆ వ్యక్తి గుడిలో సాయిబాబా ముందు తల వంచి తిరిగి లేవలేదు. ఆ వ్యక్తిని రాకేష్గా గుర్తించారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.
స్థానికంగా మెడికల్ షాప్ నడుపుతున్న రాకేష్ మెహానీకి సాయినాథుడు అంటే చాలా భక్తి. ప్రతి గురువారం మండి రోడ్డులోని సాయిబాబా ఆలయానికి వెళ్లేవాడు. అయితే డిసెంబర్ 1న సాయిబాబా ఆలయానికి వెళ్లిన రాకేష్ బాబా పాదాలను తలను వంచి ప్రార్థిస్తూ అలాగే ఉండిపోయాడు. నమస్కరిస్తున్నాడని అక్కడి భక్తులు భావించారు. అటుగా వెళ్లిన వారు నమస్కరిస్తున్న రాకేష్ నుంచి ఏ చలనం లేదు. పావుగంట పాటు కదలకుండా ఉండిపోయిన రాకేష్ స్పృహ తప్పి పడి ఉండడం చూసిన వారికి అనుమానం వచ్చింది. అయితే అక్కడే వున్న పూజారి రాకేష్ ను తడిమి చూడగా రాకేష్ స్పృహలో లేదు. విషయం తెలుసుకున్న ఆలయ పూజారి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాకేష్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. రాకేష్ గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. అక్కడున్న సీసీటీవీలో రాకేష్ కుప్పకూలిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన సాయిబాబా పాదాల చెంత మరణించడం వల్ల మోక్షం లేదా స్వర్గం లభిస్తుందని సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు.
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని పిలువబడే సైలెంట్ హార్ట్ ఎటాక్ విపరీతమైన ఛాతీ నొప్పి, ఒత్తిడి, అకస్మాత్తుగా శ్వాస ఆడకపోవడం, తల తిరగడం వంటి లక్షణాలను కలిగి ఉంటుందని ఆరోగ్య నిపుణుల అంటున్నారు. బయటకి ఆరోగ్యంగా కనిపించినా క్షణాల్లో గుండెపోటుతో చనిపోతారని అన్నారు. రాకేష్ కి కూడా ఇలా చనిపోవడానికి కారణం ఇదే అని చెబుతున్నారు.
मध्यप्रदेश कटनी साईं मंदिर में बाबा के चरणों में टेका मत्था, फिर सिर नहीं उठा पाया युवक, हार्ट अटैक से मौत!#katni pic.twitter.com/zn3Wx1ts7Z
— manishkharya (@manishkharya1) December 4, 2022
తాజావార్తలు
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
-
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
-
E85 Flex Fuel Vehicles: చౌకైన E85 పెట్రోల్ తో నడిచే వాహనాలు.. భారత్లో ఏవి కొనవచ్చు? కార్లు & బైకులు పూర్తి జాబితా!
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?