Saibaba Temple: సాయి పాదాలమీదే ప్రాణాలు వదిలాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saibaba Temple: చావు ఎప్పుడు ఏ క్షణాల మనిషికి ప్రాణాలు తీసుకుంటుందో తెలియని అయోమయం. మాట్లాడుతున్న, డ్యాన్స్ చేస్తున్న ఏ క్షణాన మృత్యువు తన ఓడికి చేర్చుకుంటుందో తెలియదు. ఇలాంటి ఘటనలు మనం తరుచూ చూస్తున్నాము. సాయిబాబా ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రార్థనలు చేస్తూ మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. ఆ వ్యక్తి గుడిలో సాయిబాబా ముందు తల వంచి తిరిగి లేవలేదు. ఆ వ్యక్తిని రాకేష్గా గుర్తించారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.
స్థానికంగా మెడికల్ షాప్ నడుపుతున్న రాకేష్ మెహానీకి సాయినాథుడు అంటే చాలా భక్తి. ప్రతి గురువారం మండి రోడ్డులోని సాయిబాబా ఆలయానికి వెళ్లేవాడు. అయితే డిసెంబర్ 1న సాయిబాబా ఆలయానికి వెళ్లిన రాకేష్ బాబా పాదాలను తలను వంచి ప్రార్థిస్తూ అలాగే ఉండిపోయాడు. నమస్కరిస్తున్నాడని అక్కడి భక్తులు భావించారు. అటుగా వెళ్లిన వారు నమస్కరిస్తున్న రాకేష్ నుంచి ఏ చలనం లేదు. పావుగంట పాటు కదలకుండా ఉండిపోయిన రాకేష్ స్పృహ తప్పి పడి ఉండడం చూసిన వారికి అనుమానం వచ్చింది. అయితే అక్కడే వున్న పూజారి రాకేష్ ను తడిమి చూడగా రాకేష్ స్పృహలో లేదు. విషయం తెలుసుకున్న ఆలయ పూజారి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాకేష్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. రాకేష్ గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. అక్కడున్న సీసీటీవీలో రాకేష్ కుప్పకూలిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన సాయిబాబా పాదాల చెంత మరణించడం వల్ల మోక్షం లేదా స్వర్గం లభిస్తుందని సోషల్ మీడియాలో పలువురు పేర్కొంటున్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని పిలువబడే సైలెంట్ హార్ట్ ఎటాక్ విపరీతమైన ఛాతీ నొప్పి, ఒత్తిడి, అకస్మాత్తుగా శ్వాస ఆడకపోవడం, తల తిరగడం వంటి లక్షణాలను కలిగి ఉంటుందని ఆరోగ్య నిపుణుల అంటున్నారు. బయటకి ఆరోగ్యంగా కనిపించినా క్షణాల్లో గుండెపోటుతో చనిపోతారని అన్నారు. రాకేష్ కి కూడా ఇలా చనిపోవడానికి కారణం ఇదే అని చెబుతున్నారు.
मध्यप्रदेश कटनी साईं मंदिर में बाबा के चरणों में टेका मत्था, फिर सिर नहीं उठा पाया युवक, हार्ट अटैक से मौत!#katni pic.twitter.com/zn3Wx1ts7Z
— manishkharya (@manishkharya1) December 4, 2022
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!