ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపెవరిది? మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు వస్తే గెలుపెవరిది? మళ్లీ ప్రజలు ఎవరి పట్టం కడతారు? ఎన్డీఏకు వచ్చే సీట్లు ఎన్ని? యూపీఏ గెలుచుకోబోతోన్న స్థానాలు ఇంకెన్ని? లాంటి ఆస్తికరమైన అంశాలపై సర్వే ఫలితాలను విడుదల చేసింది ఇండియా టుడే.. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట జరిగిన ఈ సర్వే రిపోర్టుల్లో ఆసక్తికర అంశాలు బయటపెట్టింది.. మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఆ సర్వే తేల్చేసింది.. 543 స్థానాలున్న లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీఏ 296 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. యూపీఏ 127 స్థానాలో సరిపెట్టుకుంటుందని.. ఇతరుల 120 స్థానాలు దక్కించుకుంటారని వెల్లడించింది. ఇక, పార్టీల వారీగా చూస్తే.. అత్యధికంగా బీజేపీయే 271 స్థానాలను కైవసం చేసుకుంటుందని.. కాంగ్రెస్ పార్టీ 62 సీట్లకే పరిమితం అవుతుందని.. ఇతరులకు 210 స్థానాల్లో విజయం సాధిస్తారని పేర్కొంది.
వచ్చే నెలలో ఐదు రాష్ట్రాలు.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ మరియు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ సర్వే ఫలితాలు ఆసక్తికరంగా మారాయి.. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’లో కీలకమైన రాజకీయ పార్టీలు, నేతలు, దేశానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమస్యల గురించి భారతీయులు ఏమనుకుంటున్నారు? అనే దానిపై ఈ సర్వే నిర్వహించారు.. ఇక, పెద్ద రాష్ట్రాల్లో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే.. రాజస్థాన్లో ఎన్డీఏ 24 సీట్లు గెలుచుకుంటుంది.. గుజరాత్లో ఎన్డీఏ 25 సీట్లు కైవసం చేసుకుంటుంది.. మహారాష్ట్రలో యూపీఏ 32 సీట్లలో విజయం సాధిస్తుంది.. కర్ణాటకలో ఎన్డీఏ 17 సీట్లు, యూపీఏ 10 సీట్లు గెలుచుకుంటాయని.. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.
Also Read
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
- RBI Bulletin: బలహీన రుతుపవనాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపొచ్చు.. నిపుణుల హెచ్చరిక
- Neet Re Exam: పేపర్ లీక్ చేస్తే 'క్షమాపణ'.. గేటు దాటకపోతే 'బలిపశువా'..?
- Tags
తాజావార్తలు
-
Jamun: రోజుకు 8 నుంచి 10 నేరేడు పండ్లు.. డాక్టర్లు చెప్పిన ఆరోగ్య రహస్యం!
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
Virat Kohli: “నా పని అయిపోయింది.. మళ్లీ ఆడాలనుకోవడం లేదు”.. కోహ్లీ షాకింగ్ స్టేట్మెంట్..
-
Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి!
-
Vijay – Trisha : అన్ఫాలో చేసిన త్రిష.. విజయ్తో ఇక బ్రేకప్?
ట్రెండింగ్
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!