India Monsoon Rainfall Deficit: మాయమైన రుతుపవనాలు.. ఉపగ్రహ చిత్రాల్లో ఆందోళనకర దృశ్యాలు
- మాయమైన రుతుపవనాలు
- దేశవ్యాప్తంగా రుతుపవనాలు వేగం కోల్పోయి బలహీనపడ్డాయి
- పలు రాష్ట్రాలు తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుణ దేవా కరుణించవా? కుండపోత వర్షాలతో మమ్మల్ని ఆదుకోవా అంటూ రైతన్నలు వేడుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ముందుకు కదిలిన రుతుపవనాలు మాయమవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు వేగం కోల్పోయి బలహీనపడ్డాయి. ఇటీవల వరకు వేగంగా ముందుకు సాగిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు అనేక ప్రాంతాల్లో నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో కూడా వర్ష మేఘాల కదలికలు తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాలు తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయి.
వాతావరణ శాఖ (IMD) గణాంకాల ప్రకారం, జూన్ ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా నమోదైన వర్షపాతం సాధారణ స్థాయి కంటే గణనీయంగా తక్కువగా ఉంది. జూన్ 4 నుంచి జూన్ 14 మధ్య దేశంలో సాధారణంగా కురవాల్సిన 47.7 మిల్లీమీటర్ల వర్షపాతానికి బదులుగా కేవలం 34.3 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే నమోదైంది. అంటే, దేశవ్యాప్తంగా సుమారు 28 శాతం వర్ష లోటు నమోదైంది.
Also Read
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Beggar Woman’s Surprising Savings: జీవితాంతం వీధుల్లో భిక్షాటన చేసిన మహిళ.. మరణానంతరం బయటపడ్డ రూ.8.40 లక్షలు!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
- Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
ఉపగ్రహ చిత్రాల్లో ఏమి కనిపిస్తోంది?
తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం, మధ్య భారతదేశం, పశ్చిమ భారతదేశం, వాయువ్య ప్రాంతాల్లో వర్ష మేఘాల విస్తరణ బలహీనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అంతర్భాగ రాష్ట్రాల్లో మేఘావరణం తగ్గిపోవడం వల్ల రుతుపవనాల పురోగతి మందగించినట్లు నిపుణులు చెబుతున్నారు.
రుతుపవనాలు ఎందుకు బలహీనపడ్డాయి?
ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ విశ్లేషణ ప్రకారం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు, తుఫాన్లు లేదా డిప్రెషన్లు ఏర్పడకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా ఇవే తేమతో కూడిన గాలులను భూభాగంలోకి తీసుకువచ్చి రుతుపవనాల వేగాన్ని పెంచుతాయి. అయితే ఈసారి అలాంటి వ్యవస్థలు లేకపోవడంతో రుతుపవనాలు నెమ్మదించాయని పేర్కొంది.
కొన్ని ప్రాంతాల్లో తీవ్ర లోటు
వర్షాల పంపిణీ కూడా అసమానంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణానికి దగ్గరగా వర్షాలు నమోదవుతుండగా, మరికొన్ని ప్రాంతాలు తీవ్ర లోటును ఎదుర్కొంటున్నాయి. వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ పంటల సాగుపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రైతుల్లో ఆందోళన
రుతుపవనాలపై ఆధారపడే భారత వ్యవసాయ రంగానికి ఈ పరిస్థితి సవాలుగా మారింది. విత్తనాలు వేసిన రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తుండగా, నీటి నిల్వలు కూడా ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. వర్షాభావం కొనసాగితే పంటల దిగుబడిపై ప్రభావం పడే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
ఆశాజనక సంకేతాలు కూడా..
అయితే, నెల ద్వితీయార్థంలో పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. వాతావరణ వ్యవస్థల్లో మార్పులు చోటుచేసుకుంటే రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
-
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
-
Ponguleti Srinivas Reddy : 22ఏ భూములపై మంత్రి పొంగులేటి బిగ్ క్లారిటీ
-
CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!