Mohan Bhagwat: భారత్ అనే నామం సంప్రదాయం కాదు.. జీవితం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

  • ఢిల్లీలో మోహన్ భగవత్ పర్యటన
  • సంస్కృత భారతి కేంద్ర కార్యాలయం ప్రారంభం
  • సంస్కృతం భాష మాత్రమే కాదు.. భారత ఆత్మ
  • భారత్ అనే నామం సంప్రదాయం అని వ్యాఖ్య
Mohan Bhagwat

Mohan Bhagwat

భారతదేశం అనే పేరు కేవలం భౌగోళికమైనది మాత్రమే కాదని.. ఒక సంప్రదాయం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఢిల్లీలో సంస్కృత భారతి కేంద్ర కార్యాలయాన్ని మోహన్ భగవత్ ప్రారంభించి కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్కృతం ఒక భాష మాత్రమే కాదని.. అది భారత ఆత్మ అని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఆలోచనా విధానం, జీవన విధానం అని పేర్కొన్నారు. సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతున్న దేశం ఏదైనా ఉందంటే భారతదేశమే అన్నారు. ఈ సంప్రదాయం సంస్కృతంలో నిక్షిప్తమై ఉందని చెప్పుకొచ్చారు. అదే విధంగా భారత్ అనే నామం కేవలం భౌగోళిక పరిమితే కాదని.. ఇది కేవలం రాజకీయ లేదా ఆర్థిక వ్యవస్థ కాదన్నారు. జీవితం కొనసాగడానికి ఆధారమైన గొప్ప సంప్రదాయం భారత్ అని తెలిపారు.

ఇది కూడా చదవండి: Iran-US: ఇరాన్-యూఎస్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. నౌకలపై పరస్పర దాడులు

ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ఢిల్లీలో సంస్కృత భారతి ప్రారంభోత్సవం జరుగుతోంది. సంస్కృతానికి దేశంలో చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ప్రజలు తమ దైనందిన జీవితంలో కూడా సంస్కృతాన్ని కొద్దిగా ఉపయోగించడం ప్రారంభించారు. ఇది మాకు గర్వకారణం. దేశంలో సంస్కృతిని ప్రోత్సహించడానికి, దాని ప్రాముఖ్యతను పెంచడానికి ఇది ఒక ప్రధానమైన తోడ్పాటు. ఈరోజు ఇక్కడ ఈ కార్యాలయ ప్రారంభోత్సవం జరుగుతోంది. ఇక్కడి నుంచి ఎంతో శక్తి ఉద్భవించి.. దేశవ్యాప్తంగా ప్రజలు తమ దైనందిన జీవితంలో దీనిని ఉపయోగించడం ప్రారంభించాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను.’’ అని తెలిపారు.