Iran-US: ఇరాన్-యూఎస్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. నౌకలపై పరస్పర దాడులు
- మధ్యప్రాచ్యంలో మళ్లీ టెన్షన్ వాతావరణం
- ఇరాన్ నౌకపై అమెరికా సైన్యం దాడి
- అమెరికా నౌకలపై ఇరాన్ ప్రతీకార దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. హార్ముజ్లో ఇరాన్ సరుకు రవాణా నౌకను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేసింది. అంతేకాకుండా నౌకను స్వాధీనం చేసుకుంది. దీంతో ఇరాన్ కూడా ప్రతీకారంగా అమెరికా సైనిక నౌకలపై డ్రోన్ దాడులు చేస్తోంది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. శాంతి ఒప్పందంతో పరిస్థితులు చక్కబడతాయని అనుకుంటుంటే.. మళ్లీ మొదటికొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Iran-US Talks: ఇరాన్తో చర్చలకు నేడు ఇస్లామాబాద్కు జేడీ వాన్స్ రాక.. టెహ్రాన్ తిరస్కరణ
Also Read
- Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
- Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
- Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్హౌస్
ఇస్లామాబాద్ వేదికగా రెండో విడత చర్చల కోసం రెండు దేశాలు సిద్ధపడుతున్న తరుణంలో మధ్యప్రాచ్యంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒమాన్ సముద్రంలో అమెరికా సైనిక నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడులు జరిపినట్లు ఇరాన్కు చెందిన సెమీ-ఆఫిషియల్ టస్నీమ్ వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికా చర్యలకు ప్రతిగా ఈ దాడులు జరిగినట్లు తెలిపింది. అయితే ఈ దాడుల్లో ఎన్ని డ్రోన్లు ఉపయోగించారో.. అమెరికా నౌకలకు ఎంత నష్టం జరిగింది అనేది స్పష్టత ఇవ్వలేదు.
ట్రంప్ ప్రకటన..
ఇరాన్కు చెందిన ‘టౌస్కా’ అనే కార్గో నౌక హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో అమెరికా మెరైన్స్ నౌకపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆ నౌక పూర్తిగా అమెరికా నియంత్రణలో ఉందని వెల్లడించారు. అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ఈ ఆపరేషన్ను ధృవీకరించింది. నౌక స్వాధీనం చేసుకున్న దృశ్యాలను విడుదల చేసింది.
ఇరాన్ విమర్శ
అమెరికా చర్యను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఖాతమ్ అల్-అన్బియా సైనిక కమాండ్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాకుండా “ఆర్మ్డ్ పైరసీ” అని పేర్కొన్నారు. అమెరికా దళాలు నౌకపై కాల్పులు జరిపి.. నావిగేషన్ వ్యవస్థను నిలిపివేసి సిబ్బందిని పంపించాయని ఆరోపించారు. ఈ చర్యలకు తగిన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరించారు. మొదట నౌక స్వాధీనం కాలేదని చెప్పిన ఇరాన్.. తర్వాత అమెరికా ధృవీకరణ తర్వాత ఆ విషయాన్ని అంగీకరించింది. ఆ నౌక చైనా నుంచి ఇరాన్కు వస్తోందని తెలిపింది.
చర్చలపై అనిశ్చితి
తాజా పరిణామాలతో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ప్రతిపాదించిన రెండో విడత చర్చలకు ఇరాన్ నిరాకరించింది. నౌకా దిగ్బంధనం, అమెరికా విధిస్తున్న కఠిన షరతులు కారణంగా చర్చలు జరగవని తెలిపింది.
ట్రంప్ హెచ్చరికలు
అమెరికా షరతులను అంగీకరించకపోతే ఇరాన్ వంతెనలు, విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికలకు ప్రతిగా ఇరాన్ స్పందిస్తూ.. తమ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరిగితే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Les forces iraniennes ont ciblé des navires de guerre américains avec des drones après que des Marines aient attaqué et abordé le M/V Touska battant pavillon iranien – Tasnim.
Vidéo : interception du M/V Touska par la marine américaine pic.twitter.com/8Ac5Tzwvob
— Renard Jean-Michel (@Renardpaty) April 20, 2026
తాజావార్తలు
-
Nandamuri Tejaswini: డాన్స్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేసిన బాలకృష్ణ చిన్న కుమార్తె.. వీడియో వైరల్
-
HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
-
AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
-
Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
-
Peddi Ticket Price Hike: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెరగనట్లేనా..? హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మూవీ టీమ్..!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..