Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధిపతి మోహన్ భాగవత్ ఆదివారం బంగ్లాదేశ్ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాలోని హిందువులకు గట్టి సందేశం ఇచ్చారు. దేశంలో హిందూ జనాభా తమ హక్కుల కోసం పోరాడితే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మద్దతు లభిస్తుందని చెప్పారు. వర్లీలోని నెహ్రూ సెంటర్లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ‘‘100 ఇయర్స్ జర్నీ ఆఫ్ సంఘ్: న్యూ హారిజొన్’’ అనే కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రసంగించారు.
Mohan Bhagwat: భారతీయ వస్తువులపై డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధం మధ్య.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ స్వదేశీ మంత్రాన్ని పునరుద్ఘాటించారు. ఆర్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో నాగ్పూర్లోని ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. అమెరికా సుంకాలు భారతదేశానికి పెద్ద సవాలుగా మారాయన్నారు. దీని ప్రభావం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుందని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇతర దేశాలపై ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు. స్వావలంబన అంశాన్ని ప్రస్తావించారు. స్వదేశీ,…