బ్రిటన్ పౌరులకు గుడ్న్యూస్ చెప్పింది భారత ప్రభుత్వం… భారత టూరిస్టులపైఔ గతంలో బ్రిటన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే కాగా.. ఆ వెంటనే కేంద్రం కూడా అక్టోబర్ 1వ తేదీ నుంచి భారత్కు వచ్చే బ్రిటన్ పౌరులకు క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.. భారత్ క్యాక్సినేషన్ ను గుర్తించబోమన్న బ్రిటన్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఆ నిర్ణయానికి వచ్చింది. కానీ, అయితే, తమ నిర్ణయంపై భారత సర్కార్ ఆగ్రహాన్ని గుర్తించిన బ్రిటన్.. తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇక, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులు బ్రిటన్కు వస్తే క్వారంటైన్లో ఉండాల్సిన పనేలేదని ప్రకటించింది.. ఈవారం ఆరంభం నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రాగా.. ఇక, తాజాగా బ్రిటన్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది భారత ప్రభుత్వం… తప్పనిసరి క్వారంటైన్ నిబంధన నుంచి బ్రిటన్ను మినహాయిస్తున్నట్టు ప్రకటించింది.