Pakistan: ఒకే వేదికపై లష్కరే ఉగ్రవాదులతో మంత్రులు.. పాక్ టెర్రర్ లింకులు బహిర్గతం..
- పాకిస్తాన్ టెర్రర్ లింకులు బహిర్గతం..
- ఒకే వేదికపై పాక్ మంత్రులు, లష్కరే తోయిబా ఉగ్రవాదులు..
- భారత వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల నినాదాలు..
- ర్యాలీలో పాల్గొన్న పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సైఫుల్లా కసూరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వం, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలు మరోసారి బహిర్గమయ్యాయి. భారత్ ఎంతో కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తుందని చెబుతోంది. తాజాగా, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని కసూర్ జిల్లాలో మే 28న జరిగిన భారత వ్యతిరేక ర్యాలీలో పంజాబ్ ప్రావిన్స్ మంత్రులతో లష్కరే తోయిబా ఉగ్రవాదులు వేదికను పంచుకున్నారు. పాకిస్తాన్ అణు పరీక్షలకు గుర్తుగా యూమ్-ఏ-తక్బీర్ కార్యక్రమంలో వీరంతా తమ భారత వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ ఆహార మంత్రి మాలిక్ రషీద్ అహ్మద్ ఖాన్, పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్ ఇద్దరూ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్ లకు అత్యంత సన్నిహితులు. వీరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు సైఫుల్లా కసూరి, తల్హా సయీద్ (హఫీజ్ సయీద్ కుమారుడు) మరియు అమీర్ హంజా వంటి వారితో వేదికను పంచుకున్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. భారతదేశంపై విషం కక్కారు. నిఘావర్గాలు ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారిగా సైఫుల్లా కసూరిని భావిస్తున్నారు.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
Read Also: Russia: చైనా వ్యతిరేక కుట్రతో భారత్ను నాటో ఆకర్షిస్తోంది.. ఆర్ఐసీ పునరుద్ధరణపై రష్యా..
మంత్రి మాలిక్ రషీద్ మాట్లాడుతూ.. నేడు 24 కోట్ల మంది పాకిస్థానీలకు సైఫుల్లా కసూరి, హఫీజ్ సయీద్ వంటి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారని బహిరంగంగానే ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాక్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి జరిపింది. దీంతో మురిడ్కే కూడా ఒకటి. మురిడ్కే దాడిలో కీలకమైన ఉగ్రవాది లష్కర్ కమాండర్ ముదాసిర్ హతమయ్యాడు. ఇతడి సోదరుడికి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందని కూడా ఆయన ప్రకటించారు.
సైఫుల్లా కసూరి మాట్లాడుతూ, పహల్గామ్ ఉగ్రవాద దాడికి సూత్రధాని అని నన్ను నిందించారు, ఇప్పుడు నా పేరు ప్రపంచానికి తెలిసిందని అని గర్వంగా చెప్పుకున్నాడు. కసూరీని పాకిస్తాన్ ఐఎస్ఐ రక్షిస్తోంది. ఈ కార్యక్రమంలో భారత వ్యతిరేక, ఖలిస్తానీ అనుకూల నినాదాలు ప్రతిధ్వనించాయి. లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ఉగ్రవాది అమీర్ హంజా వేదికపై నుంచి ఖలిస్తానీ అనుకూల నినాదాలను లేవనెత్తాడు. భారత్లో ఖలిస్తాన్ పేరుతో అశాంతిని రెచ్చగొట్టాలనే కుట్రకు తెరలేపాడు. మరోవైపు, రావల్పిండిలో జరిగిన ర్యాలీలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ ఫోటోలను ప్రదర్శించారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!