Russia: చైనా వ్యతిరేక కుట్రతో భారత్ను నాటో ఆకర్షిస్తోంది.. ఆర్ఐసీ పునరుద్ధరణపై రష్యా..
- రష్యా-భారత్-చైనా (ఆర్ఐసీ) పునరుద్ధరణకు రష్యా యత్నాలు..
- చైనా వ్యతిరేకతను చూపి భారత్ని నాటో ఆకర్షిస్తోంది..
- రష్యా విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: రష్యా-భారతదేశం-చైనా (RIC) ఫార్మాట్లోని కార్యకలాపాల పునరుద్ధరణకు రష్యా ప్రయత్నిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం అన్నారు. చైనా వ్యతిరేక కుట్రలోకి భారతదేశాన్ని ఆకర్షించడానికి నాటో బహిరంగంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మాజీ రష్యన్ ప్రధాని యెవ్జెనీ ప్రియాకోవ్ చాలా ఏళ్ల క్రితమే రష్యా, భారత్, చైనా అనే త్రయం ఫార్మాట్కి చొరవ చూపారాని, దీని పునఃప్రారంభంపై మాకు ఆసక్తి ఉందని ఆయన వెల్లడించారు. దీనిపై మంత్రుల స్థాయిలో అప్పటి నుంచి 20 సార్ల కంటే ఎక్కువగా సమావేశాలు నిర్వహించామని, విదేశాంగ విధాన ముఖ్యుల స్థాయిలో మాత్రమే కాకుండా, మూడు దేశాల ఇతర ఆర్థిక, వాణిజ్య మరియు ఆర్థిక సంస్థల అధిపతులతో కూడా సమావేశం జరిగినట్లు లావ్రోవ్ అన్నారు.
Read Also: IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్ కు ఆర్సీబీ.. క్వాలిఫయర్-1లో తడబడిన పంజాబ్
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
పెర్మ్ నగరంలోని యూరేషియా భద్రత, సహకారం కోసం ఒకే సమానమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంపై జరిగిన అంతర్జాతీయ సామాజిక, రాజకీయ సమావేశంలో లావ్రోవ్ ప్రసంగించారు. ‘‘ భారత్, చైనా మధ్య సరిహద్దు అవగాహన కుదిరిందని నేను ఈ రోజు అర్థం చేసుకున్నాను. ఈ RIC త్రయం యొక్క పునరుద్ధరణకు సమయం ఆసన్నమైందని నాకు అనిపిస్తోంది’’ అని ఆయన చెప్పారు. చైనా వ్యతిరేక కుట్రల్లోకి భారతదేశాన్ని ఆకర్షించడానికి నాటో స్పష్టంగా ప్రయత్నిస్తోందని లావ్రోవ్ ఆరోపించారు. మా భారతీయ మిత్రులు, వారి రహస్య సంభాషణల ఆధారంగా తాను ఈ విషయం చెబుతున్నట్లు వెల్లడించారు.
జూన్ 2020లో గాల్వాన్ సంక్షోభం తర్వాత RIC త్రయం నిలిచిపోయింది. అయితే, 2024 అక్టోబర్లో రష్యా కజాన్లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోడీ, చైనా ప్రెసిడెంగ్ జి జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరాన్ని ఇరు దేశాల నేతలు వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ముందు సరిహద్దు వద్ద ఒక అవగాహన కుదిరింది. ఇరు దేశాల సైన్యాలు ఉద్రిక్త ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లాయి.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!