Russia: చైనా వ్యతిరేక కుట్రతో భారత్ను నాటో ఆకర్షిస్తోంది.. ఆర్ఐసీ పునరుద్ధరణపై రష్యా..
- రష్యా-భారత్-చైనా (ఆర్ఐసీ) పునరుద్ధరణకు రష్యా యత్నాలు..
- చైనా వ్యతిరేకతను చూపి భారత్ని నాటో ఆకర్షిస్తోంది..
- రష్యా విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
Russia: రష్యా-భారతదేశం-చైనా (RIC) ఫార్మాట్లోని కార్యకలాపాల పునరుద్ధరణకు రష్యా ప్రయత్నిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం అన్నారు. చైనా వ్యతిరేక కుట్రలోకి భారతదేశాన్ని ఆకర్షించడానికి నాటో బహిరంగంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మాజీ రష్యన్ ప్రధాని యెవ్జెనీ ప్రియాకోవ్ చాలా ఏళ్ల క్రితమే రష్యా, భారత్, చైనా అనే త్రయం ఫార్మాట్కి చొరవ చూపారాని, దీని పునఃప్రారంభంపై మాకు ఆసక్తి ఉందని ఆయన వెల్లడించారు. దీనిపై మంత్రుల స్థాయిలో అప్పటి నుంచి 20 సార్ల కంటే ఎక్కువగా సమావేశాలు నిర్వహించామని, విదేశాంగ విధాన ముఖ్యుల స్థాయిలో మాత్రమే కాకుండా, మూడు దేశాల ఇతర ఆర్థిక, వాణిజ్య మరియు ఆర్థిక సంస్థల అధిపతులతో కూడా సమావేశం జరిగినట్లు లావ్రోవ్ అన్నారు.
Read Also: IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్ కు ఆర్సీబీ.. క్వాలిఫయర్-1లో తడబడిన పంజాబ్
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
పెర్మ్ నగరంలోని యూరేషియా భద్రత, సహకారం కోసం ఒకే సమానమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంపై జరిగిన అంతర్జాతీయ సామాజిక, రాజకీయ సమావేశంలో లావ్రోవ్ ప్రసంగించారు. ‘‘ భారత్, చైనా మధ్య సరిహద్దు అవగాహన కుదిరిందని నేను ఈ రోజు అర్థం చేసుకున్నాను. ఈ RIC త్రయం యొక్క పునరుద్ధరణకు సమయం ఆసన్నమైందని నాకు అనిపిస్తోంది’’ అని ఆయన చెప్పారు. చైనా వ్యతిరేక కుట్రల్లోకి భారతదేశాన్ని ఆకర్షించడానికి నాటో స్పష్టంగా ప్రయత్నిస్తోందని లావ్రోవ్ ఆరోపించారు. మా భారతీయ మిత్రులు, వారి రహస్య సంభాషణల ఆధారంగా తాను ఈ విషయం చెబుతున్నట్లు వెల్లడించారు.
జూన్ 2020లో గాల్వాన్ సంక్షోభం తర్వాత RIC త్రయం నిలిచిపోయింది. అయితే, 2024 అక్టోబర్లో రష్యా కజాన్లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోడీ, చైనా ప్రెసిడెంగ్ జి జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరాన్ని ఇరు దేశాల నేతలు వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి ముందు సరిహద్దు వద్ద ఒక అవగాహన కుదిరింది. ఇరు దేశాల సైన్యాలు ఉద్రిక్త ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లాయి.
తాజావార్తలు
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
-
Ishan Kishan: కెప్టెన్గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
-
Rashmika-Mysa: ‘మైసా’ షూటింగ్ అప్డేట్ అదిరిపోయింది..!
-
Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్లు.. ఐపీఎల్లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!