Puvvada Ajay Kumar: ఖమ్మంలో 10కి 10 సీట్లు గెలుస్తాం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puvvada Ajay Kumar: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు 10 బీఆర్స్సే గెలుస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు చేయకుండా కలిసి పనిచేసి జిల్లాలో బీఆర్ఎస్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పక్కరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రారంభించిన అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను పూర్తి చేసుకున్నామని.. ప్రాజెక్టు నుంచి సాగునీరు సైతం రైతులకు అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
Read Also: BJP: రాహుల్ గాంధీలోకి “జిన్నా” ఆత్మ ప్రవేశిస్తుంది.. అమెరికా ప్రసంగంపై బీజేపీ విమర్శలు..
Also Read
- Nirav Modi: నీరవ్ మోడీకి బిగ్ షాక్.. రూ.100 కోట్లు కట్టాల్సిందేనని లండన్ కోర్టు సంచలన తీర్పు!
- Rainfall Deficit: ఖరీఫ్ సీజన్కు రుతుపవనాల సెగ.. రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం..
- Ketan Agarwal Case: సోదరి అనుమానం, పోలీసుల విచారణ.. కేతన్ హత్య కేసులో సియా ఎలా దొరికింది..?
- Jairam Ramesh: ఆ ఆగ్రహంతోనే కాక్రోచ్ ఉద్యమం.. జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
సీతారామ ప్రాజెక్టు కట్టడానికి కాంగ్రెస్ వాళ్లు కేసులు పెట్టి అడ్డు పడుతున్నారని విమర్శించారు. కొంత మందికి ఈ ప్రాజెక్టు కట్టడం కడుపునొప్పిగా ఉందని .. అందుకే అడ్డుకుంటున్నారని మంత్రి అన్నారు. అధికారం ఉన్నంత కాలం డబ్బులు, అధికారం అనుభవించి ఇప్పుడు కేసీఆర్ను తిడుతున్నారని మండిపడ్డారు. 10కి 10 గెలుస్తామని చెబుతున్నారు.. మీరు ఆయన జేబులో ఏమైనా ఉన్నారా? అని మంత్రి పువ్వాడ ప్రశ్నించారు. తాము అరాచకం చేస్తే మీరు అసలు రోడ్ల మీద తిరగుతారా? అంటూ మంత్రి పువ్వాడ సవాల్ విసిరారు.
రాబోయే రోజులు చాలా ముఖ్యమని.. పార్టీ కోసం పనిచేయాలని.. మూడోసారి తిరిగి అధికారంలోకి రావాలని సూచించారు. ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నవ్యక్తి ఓటుకు నోటు కేసులో నిందితుడని మంత్రి పువ్వాడ విమర్శించారు. ఈసారి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు డిపాజిట్లు కూడా రావన్నారు. తనకు వడదెబ్బ తగిలిందని.. అయినా ఏమ్మడి జిల్లాలో ఉన్న 10 సీట్లకు 10 సీట్లను గెలిపించడం కోసం జిల్లా మొత్తం తిరుగతానని మంత్రి అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 150 దాకా పొగొట్టుకున్నానని.. తాను తన కుటుంబం పంచిపెట్టేదే తప్ప దాచిపెట్టుకోవడానికి తీసుకునేది ఏమీ లేదన్నారు. తనపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తారని.. వాటిని నమ్మవద్దని ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
NBK 112: 150 కోట్లతో బాలయ్య-కొరటాల మాస్ బ్లాక్ బస్టర్
-
Bhatti Vikramarka : కేసీఆర్ అప్పులపై భట్టి బిగ్ బాంబ్..!
-
Nirav Modi: నీరవ్ మోడీకి బిగ్ షాక్.. రూ.100 కోట్లు కట్టాల్సిందేనని లండన్ కోర్టు సంచలన తీర్పు!
-
Rainfall Deficit: ఖరీఫ్ సీజన్కు రుతుపవనాల సెగ.. రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం..
-
Asim Munir: అసిమ్ మునీర్ హత్యకు కుట్ర.. మొసాద్ హిట్ లిస్టులో పాక్ ఆర్మీ చీఫ్..
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!