Puvvada Ajay Kumar: ఖమ్మంలో 10కి 10 సీట్లు గెలుస్తాం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puvvada Ajay Kumar: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు 10 బీఆర్స్సే గెలుస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు చేయకుండా కలిసి పనిచేసి జిల్లాలో బీఆర్ఎస్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పక్కరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రారంభించిన అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను పూర్తి చేసుకున్నామని.. ప్రాజెక్టు నుంచి సాగునీరు సైతం రైతులకు అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
Read Also: BJP: రాహుల్ గాంధీలోకి “జిన్నా” ఆత్మ ప్రవేశిస్తుంది.. అమెరికా ప్రసంగంపై బీజేపీ విమర్శలు..
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
- West Bengal: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. టీఎంసీ సర్కార్ బర్తరఫ్..
సీతారామ ప్రాజెక్టు కట్టడానికి కాంగ్రెస్ వాళ్లు కేసులు పెట్టి అడ్డు పడుతున్నారని విమర్శించారు. కొంత మందికి ఈ ప్రాజెక్టు కట్టడం కడుపునొప్పిగా ఉందని .. అందుకే అడ్డుకుంటున్నారని మంత్రి అన్నారు. అధికారం ఉన్నంత కాలం డబ్బులు, అధికారం అనుభవించి ఇప్పుడు కేసీఆర్ను తిడుతున్నారని మండిపడ్డారు. 10కి 10 గెలుస్తామని చెబుతున్నారు.. మీరు ఆయన జేబులో ఏమైనా ఉన్నారా? అని మంత్రి పువ్వాడ ప్రశ్నించారు. తాము అరాచకం చేస్తే మీరు అసలు రోడ్ల మీద తిరగుతారా? అంటూ మంత్రి పువ్వాడ సవాల్ విసిరారు.
రాబోయే రోజులు చాలా ముఖ్యమని.. పార్టీ కోసం పనిచేయాలని.. మూడోసారి తిరిగి అధికారంలోకి రావాలని సూచించారు. ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నవ్యక్తి ఓటుకు నోటు కేసులో నిందితుడని మంత్రి పువ్వాడ విమర్శించారు. ఈసారి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు డిపాజిట్లు కూడా రావన్నారు. తనకు వడదెబ్బ తగిలిందని.. అయినా ఏమ్మడి జిల్లాలో ఉన్న 10 సీట్లకు 10 సీట్లను గెలిపించడం కోసం జిల్లా మొత్తం తిరుగతానని మంత్రి అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 150 దాకా పొగొట్టుకున్నానని.. తాను తన కుటుంబం పంచిపెట్టేదే తప్ప దాచిపెట్టుకోవడానికి తీసుకునేది ఏమీ లేదన్నారు. తనపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తారని.. వాటిని నమ్మవద్దని ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం