Millionaire Thief: మిలియనీర్ దొంగ.. నేపాల్లో హోటల్, యూపీలో గెస్ట్హౌస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Millionaire Thief: సాధారణంగా దొంగతనాలకు పాల్పడేవారు వారు దొంగిలించిన సొమ్ముతో జల్సాలు చేస్తుంటారు. లేదంటే వారికి ఉన్న అప్పులను తీర్చుకుంటారు. ఇల్లు గడవడానికి డబ్బులను ఖర్చు చేస్తుంటారు. కానీ దొంగిలించిన సొమ్ముతో మిలియనీర్గా మారిన వ్యక్తిని చూశారా? అటువంటి వారిని చూడటం అరుదు.. అలా మారడం కూడా అరుదుగానే జరుగుతుంది. కానీ ఇక్కడ దొంగలించిన సొమ్ముతో హోటల్స్, గెస్టు హౌజ్లను కొనుగోలు చేశాడు. తన పేరు మీద, తన భారర్య పేరు మీద ఆస్తులను కొనుగోలు చేశాడు. దొంగిలించిన సొమ్ముతో లగ్జరీగా బ్రతుకుతున్నాడు. ఆయన జీవన విధానంపై అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. అతనో పెద్ద మిలియనీర్ దొంగ అని.. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ మిలియనీర్ దొంగ గురించి మీరు తెలుసుకోండి..
Read also: Amrit Kalash Scheme: గుడ్ న్యూస్.. ఎస్బీఐ అమృత్ కలాశ్ స్కీం గడుపు పొడగింపు
Also Read
ఉత్తర్ప్రదేశ్లోని సిద్దార్థ్ నగర్ జిల్లాకు చెందిన మనోజ్ చౌబే 1997లో ఢిల్లీకి వలస వచ్చి కీర్తినగర్లో ఓ క్యాంటీను ప్రారంభించాడు. క్యాంటీన్ నడుపుతూనే మరోవైపు దొంగతనాలు చేస్తుండే వాడు. దొంగతనాల నేపథ్యంలో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయితే తాను దొంగతనం చేసిన సొమ్ముతో నేపాల్లో ఓ హోటలు నిర్మించాడు. ఆ తర్వాత యూపీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తాను పార్కింగ్ కాంట్రాక్టు తీసుకున్నానని భార్యను నమ్మించాడు. ఏడాదిలో 8 నెలలు ఢిల్లీలోనే ఉండేవాడు. తాను చేసిన చోరీల సొమ్ముతో యూపీలో భార్య పేరిట ఒక గెస్టుహౌజ్ కొన్నాడు..లక్నోలో ఇల్లు కట్టాడు.. దాంతోపాటు పలు స్థిరాస్తులు కొని లీజుకు ఇచ్చాడు. తను కొన్న ఆస్తులతో అతనికి ప్రతినెలా రూ.2 లక్షలు అద్దెల రూపంలో వస్తున్నాయంటే.. అతను ఎంత సంపాదించాడు ఆలోచించుకోవచ్చు. ఇదంతా గమనించిన ఢిల్లీ పోలీసులకు మనోజ్ వ్యవహారంపై అనుమానం వచ్చింది. దాంతో అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. ఇంకేముంది.. తన గుట్టంతా మనోజ్ బయటపెట్టాడు. దీంతో విషయం కాస్త బయటకు వచ్చింది. దాంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
Read also: Telangana Rains: రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్డ్
మనోజ్ చౌబే ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్ నగర్కు చెందినవాడు, అతను దొంగతనం చేయడానికి ఢిల్లీకి వస్తాడని.. అతన్ని కరవాల్ నగర్లో అరెస్టు చేసినట్టు వాయువ్య ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ మీనా తెలిపారు. అతనికి 48 ఏళ్లని.. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారని.. ఒకరు లక్నోలో, మరొకరు ఢిల్లీలో ఉంటారని చెప్పారు. ఆయన ఇద్దరు భార్యలకు కూడా తమ భర్త దొంగ అని తెలియదని పోలీసులు తెలిపారు. అతను 200కి పైగా దొంగతనాలు చేశానని ఒప్పుకున్నాడని.. కానీ దేశ వ్యాప్తంగా దాదాపు 500 దొంగతనాల కేసుల్లో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. అతను 1997లో ఢిల్లీకి వచ్చి క్యాంటీన్లో దొంగతనానికి పాల్పడి మొదట పట్టుబడ్డాడని, పోష్ ఏరియాల్లోని ఇళ్లు అతని ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు. దొంగిలించిన డబ్బుతో చౌబే నేపాల్లో హోటల్ను నిర్మించాడని, ఉత్తరప్రదేశ్లో తన భార్యలో ఒకరికి గెస్ట్హౌస్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతను అదే ప్రాంతంలో ఒక స్థలాన్ని కూడా కొనుగోలు చేశాడని.. అతనికి నెలకు రూ. 2 లక్షల అద్దె వస్తుందని పోలీసులు తెలిపారు. అతనికి లక్నోలో ఇల్లు ఉందని.. అతని పిల్లలు రాజధాని నగరం ఢిల్లీలోని ప్రముఖ పాఠశాలలో చదువుతున్నారని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
-
IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
-
India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!