Bombay High Court: అర్ధరాత్రి నిమ్మకాయ కోసం మహిళ ఇంటి తలుపు తట్టడం అధికారికి తగునా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: అర్ధరాత్రి ఒక మహిళ ఇంటి తలుపు తట్టిన అధికారి కేసును బాంబే హైకోర్టు విచారించింది. తప్పుడు ప్రవర్తన కారణంగా అతనిపై విధించిన జరిమానాను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. జస్టిస్ నితిన్ జామ్దార్, ఎంఎం సతయేలతో కూడిన డివిజన్ బెంచ్ మార్చి 11న ఈ కేసును విచారించింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కి చెందిన కానిస్టేబుల్ ఈ ఘటనకు పాల్పడ్డాడని, అంతకుముందు మద్యం సేవించి ఉన్నాడని, తన సహోద్యోగి అయిన మహిళ భర్త పశ్చిమ బెంగాల్లో ఎన్నికల విధుల్లో ఉన్నాడని తెలుసుకుని ఇలా తప్పుగా ప్రవర్తించాడని కోర్టు పేర్కొంది.
జూలై 2021, జూన్ 2022 మధ్య సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తప్పుడు ప్రవర్తన కారణంగా జరిమానాను విధించడాన్ని సవాల్ చేస్తూ సదరు కానిస్టేబుల్ అరవింద్ కుమార్(33) పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో అతను ముంబైలోని BPCL (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్)లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతని జీతం మూడు సంవత్సరాలకు తగ్గించబడింది. ఆ సమయంలో అతనికి శిక్షగా ఎలాంటి ఇంక్రిమెంట్ లభించదు.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: IBM layoffs: కేవలం 7 నిమిషాల మీటింగ్లోనే ఉద్యోగుల లేఆఫ్.. ఐబీఎం షాకింగ్ నిర్ణయం..
అధికార నివాస గృహంలో 2021 ఏప్రిల్ 19-20 మధ్య రాత్రి అరవింద్ కుమార్, ఆరేళ్ల కుమార్తెతో నివసిస్తున్న మహిళ ఇంటి తలుపు తట్టాడని ఆరోపణలు వచ్చాయి. తన భర్త ఇంట్లో లేరని తనను ఇబ్బంది పెట్టొద్దని సదరు మహిళ అతనికి చెప్పింది. మహిళ హెచ్చరించడంతో అతను అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే, ఆ సమయంలో తనకు అనారోగ్యం ఉందని, అందుకే నిమ్మకాయల కోసం ఇరుగుపొరుగు ఇంటి వాళ్లను అడిగానని చెప్పాడు.
ఈ ఘటనకు ముందు అతను మద్యం సేవించి ఉన్నాడని, ఆ సమయంలో మహిళ భర్త ఇంట్లో లేడనే విషయం కూడా తెలుసని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంట్లో భర్త లేడని తెలిసి తన ఆరేళ్ల కూతురితో పొరుగింటిలో ఉన్న మహిళ ఇంటి తలుపు తట్టడం, దానికి కడుపు నొప్పి అనే అనే పనికిమాలిన సాకుతో నిమ్మకాయలు కావాలని అడగడం అసహ్యకరమైనదని హైకోర్టు పేర్కొంది. ఇలాంటి ప్రవర్తన సీఐఎస్ఎఫ్లో పనిచేస్తున్న అధికారికి తగనిదని పేర్కొంది. ఈ సంఘటన జరిగిన సమయంలో అతను డ్యూటీలో లేనందున ఈ సంఘటన దుష్ర్పవర్తనకు సమానం కాదనే అతని వాదనను హైకోర్టు నిరాకరించింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!