Bombay High Court: అర్ధరాత్రి నిమ్మకాయ కోసం మహిళ ఇంటి తలుపు తట్టడం అధికారికి తగునా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: అర్ధరాత్రి ఒక మహిళ ఇంటి తలుపు తట్టిన అధికారి కేసును బాంబే హైకోర్టు విచారించింది. తప్పుడు ప్రవర్తన కారణంగా అతనిపై విధించిన జరిమానాను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. జస్టిస్ నితిన్ జామ్దార్, ఎంఎం సతయేలతో కూడిన డివిజన్ బెంచ్ మార్చి 11న ఈ కేసును విచారించింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కి చెందిన కానిస్టేబుల్ ఈ ఘటనకు పాల్పడ్డాడని, అంతకుముందు మద్యం సేవించి ఉన్నాడని, తన సహోద్యోగి అయిన మహిళ భర్త పశ్చిమ బెంగాల్లో ఎన్నికల విధుల్లో ఉన్నాడని తెలుసుకుని ఇలా తప్పుగా ప్రవర్తించాడని కోర్టు పేర్కొంది.
జూలై 2021, జూన్ 2022 మధ్య సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తప్పుడు ప్రవర్తన కారణంగా జరిమానాను విధించడాన్ని సవాల్ చేస్తూ సదరు కానిస్టేబుల్ అరవింద్ కుమార్(33) పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో అతను ముంబైలోని BPCL (భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్)లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతని జీతం మూడు సంవత్సరాలకు తగ్గించబడింది. ఆ సమయంలో అతనికి శిక్షగా ఎలాంటి ఇంక్రిమెంట్ లభించదు.
Also Read
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
Read Also: IBM layoffs: కేవలం 7 నిమిషాల మీటింగ్లోనే ఉద్యోగుల లేఆఫ్.. ఐబీఎం షాకింగ్ నిర్ణయం..
అధికార నివాస గృహంలో 2021 ఏప్రిల్ 19-20 మధ్య రాత్రి అరవింద్ కుమార్, ఆరేళ్ల కుమార్తెతో నివసిస్తున్న మహిళ ఇంటి తలుపు తట్టాడని ఆరోపణలు వచ్చాయి. తన భర్త ఇంట్లో లేరని తనను ఇబ్బంది పెట్టొద్దని సదరు మహిళ అతనికి చెప్పింది. మహిళ హెచ్చరించడంతో అతను అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే, ఆ సమయంలో తనకు అనారోగ్యం ఉందని, అందుకే నిమ్మకాయల కోసం ఇరుగుపొరుగు ఇంటి వాళ్లను అడిగానని చెప్పాడు.
ఈ ఘటనకు ముందు అతను మద్యం సేవించి ఉన్నాడని, ఆ సమయంలో మహిళ భర్త ఇంట్లో లేడనే విషయం కూడా తెలుసని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంట్లో భర్త లేడని తెలిసి తన ఆరేళ్ల కూతురితో పొరుగింటిలో ఉన్న మహిళ ఇంటి తలుపు తట్టడం, దానికి కడుపు నొప్పి అనే అనే పనికిమాలిన సాకుతో నిమ్మకాయలు కావాలని అడగడం అసహ్యకరమైనదని హైకోర్టు పేర్కొంది. ఇలాంటి ప్రవర్తన సీఐఎస్ఎఫ్లో పనిచేస్తున్న అధికారికి తగనిదని పేర్కొంది. ఈ సంఘటన జరిగిన సమయంలో అతను డ్యూటీలో లేనందున ఈ సంఘటన దుష్ర్పవర్తనకు సమానం కాదనే అతని వాదనను హైకోర్టు నిరాకరించింది.
తాజావార్తలు
-
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
-
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
-
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
-
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..