NEET PG 2022: అభ్యర్థుల ప్రయోజనం కోసం మరిన్ని సీట్లను చేర్చడానికి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సోమవారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET-PG) కౌన్సెలింగ్ను రీషెడ్యూల్ చేసింది. నీట్ పీజీ-2022 కౌన్సెలింగ్ కోసం మొదటి రౌండ్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 1, 2022న ప్రారంభం కావాల్సి ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ ప్రస్తుత విద్యా సంవత్సరానికి కొత్త అనుమతులను జారీ చేసే ప్రక్రియలో ఉంది. ఆ ప్రక్రియ సెప్టెంబర్ 15 నాటికి పూర్తి కానుంది.అందువల్ల కౌన్సెలింగ్లో అభ్యర్థుల ప్రయోజనం కోసం మరిన్ని సీట్లను చేర్చడానికి.. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కావాల్సిన నీట్ పీజీ-2022 కౌన్సెలింగ్ను తిరిగి షెడ్యూల్ చేయాలని కాంపిటెంట్ అథారిటీ నిర్ణయించిందని అధికారిక నోటీసులో వెల్లడైంది.
Merugu Nagarjuna: జగనన్న విదేశీవిద్యకు దరఖాస్తుల ప్రక్రియ షురూ.. గడువు?
నీట్ పీజీ-2022 కౌన్సెలింగ్ సాధారణ షెడ్యూల్ రీషెడ్యూల్ చేయబడుతోందని.. అభ్యర్థులు తాజా షెడ్యూల్ కోసం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వెబ్సైట్తో టచ్లో ఉండాలని అధికారిక నోటీసులో సూచించారు. . కొత్త షెడ్యూల్ను ప్రకటించనప్పటికీ, సెప్టెంబర్ మూడో వారంలో కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. నీట్-పీజీ 2022 కౌన్సెలింగ్ విద్యార్థుల జీవితాన్ని ప్రమాదంలో పడేసే అవకాశం లేదని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. నీట్-పీజీ 2022కి సంబంధించిన జవాబు కీ, ప్రశ్నపత్రాన్ని విడుదల చేయకూడదనే జాతీయ పరీక్షల బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఒక పిటిషన్లో ఈ విషయం ప్రస్తావించబడింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల స్కోర్లలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని పిటిషన్లో పేర్కొంది.