Sugar Mill Fire Accident: ఉత్తరప్రదేశ్ చక్కెర మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Massive Fire Erupts At Sugar Mill In Uttar Pradesh Meerut: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈరోజు (26-11-22) మధ్యాహ్నం మొహియుద్దీన్పూర్ చక్కెర మిల్లులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నరేంద్ర కుష్వాహా అనే ఒక ఇంజినీర్ మృతి చెందాడు. ఘటనలో తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిల్లు నుంచి పెద్దఎత్తున పొగలు రావడంతో.. ఉద్యోగులు ఒక్కసారిగా సురక్షిత ప్రాంతాలకు పరుగు తీశారు.
ఈ ఘటన గురించి మిల్లు జనరల్ మేనేజర్ శీష్పాల్ సింగ్ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలో ఒక టర్బైన్ ఒక్కసారిగా ట్రిప్ అయ్యిందన్నారు. దాన్ని పరిశీలించడానికి తాము వెళ్లగా.. ఇంతలో దట్టమైన పొగలు ఫ్యాక్టరీని చుట్టుముట్టడం ప్రారంభించాయన్నారు. అప్పుడు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి.. వెంటనే బయటకు పరుగులు తీశారని పేర్కొన్నారు. అయితే.. ఈ ఘటనలో తమ ఇంజినీర్లలో ఒకరు తీవ్రంగా గాయపడిన కారణంగా, అతడ్ని ఆసుపత్రికి తరలించామన్నారు. కానీ, పరిస్థితి విషమించడంతో అతడు చికిత్స పొందుతూ మరణించాడన్నారు.
Also Read
- Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
- Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!
ఇక ఈ ఘటనపై ఫైర్ ఆఫీసర్ ఆర్కే సింగ్ మాట్లాడుతూ.. తమకు ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి మధ్యా్హ్నం 3 గంటలకు సమాచారం అందిందని, వెంటనే తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని తెలిపారు. ఇదో భారీ అగ్ని ప్రమాదం కావడంతో తాము తొలుత పత్తాపూర్ నుంచి రెండు, ఆ తర్వాత పోలీస్ లైన్ నుంచి మరో నాలుగు ఫైర్ టెండర్స్ని పిలిచామన్నారు. మంటలను ఆర్పేందుకు మొత్తంగా ఏడు ఫైర్ టెండర్లు సేవలో ఉన్నాయన్నారు. మంటలు ఆర్పేశాక.. ఎంత నష్టం జరిగింది, ఈ ఘటనకు గల కారణాలేంటో తెలుసుకుంటామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!