Site icon NTV Telugu

Kerala: మటన్ తక్కువైందని జైలు అధికారులను కొట్టిన ఖైదీ..

Motton Curry

Motton Curry

Kerala: మటన్ తక్కువగా వడ్డీస్తున్నారని చెబుతూ ఏకంగా ఓ ఖైదీ జైలు అధికారులపైనే దాడి చేశాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. తనకు వడ్డించిన మటన్ కర్రీతో సంతృప్తి చెందకపోవడంతో వయనాడ్ కు చెందిన ఖైదీ ఫైజాస్ పూజపురా సెంట్రల్ జైలులో అధికారులపై దాడికి పాల్పడ్డాడు. డ్రగ్స్ కేసులో దోషిగా తేలిన ఇతడిని ప్రస్తుతం జైలులో అత్యంత భద్రతతో కూడిన సెల్ లో ఉంచారు.

Read Also: Farming with alcohol: మద్యం ఆరోగ్యానికి మంచిది కాదు.. కానీ పంటలకు మంచిదే.. లిక్కర్‌తో వ్యవసాయం ఎక్కడంటే..?

మటన్ కర్రీతో సహా అతనికి అందించిన ఆహారం పరిమాణం తక్కువగా ఉందని జైలు అధికారులపై అసభ్యంగా ప్రవర్తించాడు. జైలు అధికారులపై దాడికి ప్రయత్నించాడు. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు ప్రస్తుత అతడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన శనివారం జరిగింది. అందరు ఖైదీల కన్నా తనకు ఎక్కువ మటన్ కావాలని కోరుతూ ఫైజాస్ దాడికి పాల్పడినట్లు సీనియర్ జైలు అధికారి తెలిపారు.

సాధారణంగా శనివారాల్లో ఖైదీలకు మటన్ కూర వడ్డిస్తామని, మామూలుగా ఇచ్చే పరిమాణం కన్నా ఎక్కువగా కావాలని అడిగాడు, ఈ వివాదంతో గొడవను ప్రారంభించాడు, వడ్డించిన మటన్ కర్రీని చెత్తబుట్టలో పారేశాడని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు పాల్పడిన ఖైదీ ఇతర జైళ్లలో కూడా ఇలాగే చేసేవాడని, ప్రస్తుతం అతడిని ప్రత్యేక వార్డుకు తరలించినట్లు తెలిపారు.

Exit mobile version