Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Man Facing Murder Case Hacked To Death In Mangaluru Attack Caught On Camera

Mangaluru Tension: హత్య కేసులో ప్రధాన నిందితుడు మర్డర్.. పోలీసుల హై అలర్ట్

Published Date :May 2, 2025 , 12:33 pm
By Suresh Maddala
  • హత్య కేసులో ప్రధాన నిందితుడు మర్డర్
  • మంగళూరులో పోలీసుల హై అలర్ట్
Mangaluru Tension: హత్య కేసులో ప్రధాన నిందితుడు మర్డర్.. పోలీసుల హై అలర్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మంగళూరులో రౌడీషీటర్ సుహాస్ శెట్టి హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. గురువారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా దుండగులు అడ్డగించి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో పోలీసులు అప్రమత్తమై.. మత ఘర్షణలు జరగకుండా హై అలర్ట్ ప్రకటించారు. భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

మే 1న రాత్రి 8:30 గంటలకు సుహాస్ శెట్టి.. మరో ఐదుగురు స్నేహితులతో కలిసి బాజ్‌పేలోని కిన్నికంబ్లాలో కారులో ప్రయాణిస్తున్నాడు. ఆరుగురు ప్రత్యర్థులు కారును అడ్డగించి.. కారులోంచి సుహాస్ శెట్టిని బయటకు లాగి విచక్షణారహితంగా కత్తులతో, రాళ్లతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. హత్య తర్వాత స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఘర్షణలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. హై అలర్ట్ ప్రకటించారు.

ఇది కూడా చదవండి: AP Crime: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..! అన్నయ్య అంటూ పరిచయం చేసి..!

మంగళూరు ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్) ఆర్ హితేంద్ర మాట్లాడుతూ.. ‘‘నిన్న సాయంత్రం సుహాస్ శెట్టి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అనంతరం నగరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అందుకు తగిన ఏర్పాట్లు చేశాం. పోస్ట్‌మార్టం జరుగుతోంది. దహన సంస్కారాలకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మంగళూరు పౌరులు శాంతిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిందితులను గుర్తించాం. పోలీస్ బృందాలు వారి కోసం గాలిస్తున్నాయి.’’ అని తెలిపారు.

ఇది కూడా చదవండి: JD Vance: ఉగ్ర వేటలో భారత్‌కు సహకరించండి.. పాక్‌కు జేడీవాన్స్ సూచన

మంగళూరు నగర పోలీసు కమిషనర్ అనుపమ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘సంఘటన గురువారం రాత్రి 8.27 గంటల ప్రాంతంలో జరిగింది. సుహాస్ వాహనంలో సంజయ్, ప్రజ్వల్, అన్విత్, లతీష్, శశాంక్‌తో కలిసి ప్రయాణిస్తుండగా ఐదు నుంచి ఆరుగురు వ్యక్తుల ముఠా వారిని అడ్డగించారు. దుండగులు సుహాస్‌ బయటకు లాగి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆసుపత్రికి తరలించారు కానీ కొద్దిసేపటికే మరణించారు.’’ అని పేర్కొన్నారు.

కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర మాట్లాడుతూ.. ‘‘నిందితులను పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశాం. మేము ఎవరినీ వదిలిపెట్టము. ఎవరినీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇది శాంతిభద్రతల వైఫల్యం కాదు. కర్ణాటకలో మేము శాంతిని కాపాడాము.’’ అని ఆయన అన్నారు.

బెంగళూరు ఎంపీ పీసీ మోహన్.. దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ‘‘మంగుళూరులో అనుమానిత జిహాదీ శక్తులు హిందూ కార్యకర్త సుహాస్ శెట్టిని దారుణంగా హత్య చేయడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి హేయమైన చర్యలు కర్ణాటకలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు నిదర్శనం. నా ప్రార్థనలు ఆయన కుటుంబంతో ఉన్నాయి. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.

సుహాస్ శెట్టిపై కనీసం ఐదు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 2022లో బీజేపీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్య జరిగిన కొద్ది రోజులకే సూరత్కల్‌లో 23 ఏళ్ల యువకుడు ఫాజిల్‌ను నరికి చంపిన కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఉన్నాడు. ఫాజిల్ హత్యకు ప్రతీకారంగానే ప్రస్తుతం ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మంగళూరు గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ శివకుమార్, హెడ్ కానిస్టేబుల్ చంద్ర పి, కానిస్టేబుల్ యల్లలింగలను సస్పెండ్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • camera
  • death
  • hacked
  • Man facing murder case
  • Mangaluru attack

తాజావార్తలు

  • Rajni : జైలర్ 2 రిలీజ్ ఎప్పుడో చెప్పిన రజినీకాంత్

  • Khanapur Municipality: ఉత్కంఠగా మారిన ఖానాపూర్ మున్సిపల్ పీఠం.! నువ్వా.. నేనా.. అంటున్న పార్టీలు.!

  • Iran vs USA War: హాలీవుడ్ రేంజ్ ఆపరేషన్.. ఇరాన్ గడ్డపైకి వెళ్లి మరీ పైలట్‌ను కాపాడుకున్న అగ్రరాజ్యం

  • Macharla CI: పరువు హత్య కేసు.. మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెన్షన్!

  • Pakistan: పెరిగిన పెట్రోల్ ధరలతో జనాగ్రహం.. అర్ధరాత్రి పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions