Ankit Sharma Case: 2020లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ హత్య కేసు.. తెలంగాణలో నేరస్తుడు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Accused Of Killing Intelligence Officer In Delhi Riots Arrested In Telangana: 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అంకిత్ శర్మను అత్యంత కిరాతకంగా హతమార్చిన నేరస్తుల్లో ఒకడ్ని సోమవారం (10-10-22) తెలంగాణలో పట్టుకున్నారు. ఆ నేరస్తుడి పేరు ముంతజిమ్ అలియాస్ ముసా ఖురేషి. చాలాకాలం నుంచి ఇతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులకు.. తెలంగాణలోని మీర్పేట్ గాయత్రి నగర్లో ఉంటున్నాడన్న సమాచారం అందింది. దీంతో.. అధికారులు రంగంలోకి దిగి, చాకచక్యంగా వ్యవహరించి, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2020 ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీ అల్లర్ల సమయంలో ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మను చాంద్బాఘ్ పులియా, ఖజూరీ నాలా, మెయిన్ కారావ ప్రాంతంలో దారుణంగా హత్యమార్చారు. అనంతరం ఆయన మృతదేహాన్ని చాంద్బాఘ్ డ్రైనేజ్ వద్ద వదిలేశారు. ఈ ఘటన జరిగిన తర్వాతి రోజు అంకిత శర్మ మృతదేహాన్ని రికవర్ చేశారు. పోస్టు మార్టం రిపోర్ట్లో.. అత్యంత పదునైన కత్తులతో అంకిత్ శర్మను 52 సార్లు పొడిచినట్టు తేలింది. కేసు నమోదు చేసి, వెంటనే విచారణ చేపట్టగా.. పది మందిపై అనుమానం వచ్చి, వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. అరెస్టైన వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ సిట్టింగ్ కౌన్సిలర్ తాహిర్ హుసేన్ కూడా ఉన్నారు. విచారణలో భాగంగా.. ఖురేషి కూడా ప్రధాన నిందితుడు అని తేలింది.
Also Read
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
అయితే.. ఖురేషి అప్పటికే పరారయ్యాడు. ఎక్కడా గాలించిన ఆచూకీ దొరక్కపోవడంతో, అతనిపై రూ. 50,000 రికార్డ్ కూడా ప్రకటించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే.. ఆరు నెలల నుంచి ఖురేషి తెలంగాణలో ఉంటోన్న విషయం పోలీసులకు తెలిసింది. దీంతో.. అతడ్ని పట్టుకునేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపింది. అతడు మీర్పేట్లోని గాయత్రి నగర్లో తరచుగా ఒక మెడికల్ షాప్కి వెళ్తాడన్న విషయాన్ని పసిగట్టారు. సోమవారం కూడా కెమిస్ట్ షాప్కి వెళ్తున్న విషయం తెలిసి, దారిలోనే అడ్డుకొని అతడ్ని అరెస్ట్ చేశారు. ఖురుషీ ఇంతకుముందు కూడా కిడ్నాప్, అత్యాచార కేసుల్లో జైలుకి వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. ఆ సమయంలోనే అతనికి ముజీబ్ అనే నేరస్తుడితో పరిచయం ఏర్పడింది.
జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత.. ఖురేషీ తన మేనమామతో కలిసి ముర్గా మండిలో పని చేయడం మొదలుపెట్టాడు. కానీ, అతనికి వచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోయేది కాదు. దీంతో, మళ్లీ నేరాలు చేయడం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 24వ తేదీన సమీర్, సల్మాన్ కలిసి చాంద్బాఘ్లో ఉన్న ఖురేషీ ఇంటికెళ్లారు. అప్పుడే వాళ్లు ఢిల్లీ అల్లర్లలో పాల్గొనాలని మాట్లాడుకున్నారు. ప్లాన్ ప్రకారం మరుసటి రోజు.. అంటే ఫిబ్రవరి 25న ఢిల్లీ అల్లర్లలో ముగ్గురు పాల్గొన్నారు. అప్పుడు ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ ఒంటరిగా ఉండటాన్ని గమనించి.. ఆ ముగ్గురు దాడి చేసి, కిరాతకంగా హతమార్చారు. ఈ కేసులో సల్మాన్, సమీర్లను ఇదివరకే అరెస్ట్ చేయగా.. ఇప్పుడు ఖురేషీని అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!