Mamata Banerjee: సుప్రీంకోర్టు తీర్పును ఏ మాత్రం అంగీకరించను.. టీచర్లకు మమత మద్దతు
- సుప్రీంకోర్టు తీర్పును ఏ మాత్రం అంగీకరించను
- జైలుకెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నా
- ఉపాధ్యాయులకు మమతా బెనర్జీ మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో 25,000 టీచర్ల నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దీంతో వాళ్లంతా రోడ్డున పడ్డారు. సుప్రీం ధర్మాసనం తీర్పుపై ఉపాధ్యాయులు కన్నీరు మున్నీరుగా విలపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. తనను జైల్లో పెట్టినా పర్వాలేదు.. ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించబోనని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఉపాధ్యాయులకు మమత మద్దతు ప్రకటించారు. దు:ఖంతో హృదయం రాయిలా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడుతున్నందుకు తనను జైల్లో పెట్టొచ్చన్నారు. తాను బతికున్నంత వరకు ఎవరూ ఉద్యోగం కోల్పోరని హామీ ఇచ్చారు. అర్హులైన ఉపాధ్యాయులకు ఎలాంటి భయం అక్కర్లేదని.. వారి ఉద్యోగాలను కాపాడే బాధ్యత తనదేనని మమత ప్రతిజ్ఞ చేశారు. తనను ఎవరైనా సవాల్ చేస్తే.. వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో తనకు బాగా తెలుసన్నారు. ఇది ‘నా నిబద్ధత’ అన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని.. అర్హులైన ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఎక్కడికి పోవన్నారు.
Also Read
- Tamil Nadu: ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. విజయ్ అభిమానుల్లో తీవ్ర ఆవేదన.. ఆత్మహత్యాయత్నం కలకలం
- Mamata Banerjee: 'మాజీ' అని పెట్టుకోను.. మమతా బెనర్జీ 'X' బయోలో తెలివైన మార్పు!
- Wedding Drama: వరమాల వేసే టైమ్లో ట్విస్ట్.. మండపం నుంచి ప్రియుడి వద్దకు పరుగెత్తిన వధువు.. కట్చేస్తే..
- PM Modi: "సిలిగురి సింహం".. ప్రధాని మోడీ స్వయంగా కాళ్లు మొక్కిన ఆ 'పెద్దాయన' ఎవరో తెలుసా?
గత వారం సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 25,000 మంది ఉపాధ్యాయ నియామకాలను సుప్రీం ధర్మాసనం పక్కన పెట్టింది. స్కూల్ సర్వీస్ కమిషన్ కింద 25,000 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాన్ని రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు గత గురువారం సమర్థించింది. ఈ ప్రక్రియ అంతా మోసం.. ద్రోహంతో తారుమారు చేయబడిందని అభిప్రాయపడింది. ఈ నియామకానికి విశ్వసనీయత లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
హైకోర్టు నిర్ణయంలో ఎలాంటి తప్పు కనిపించడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి పీవీ. సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నియామకాలన్నీ మోసపూరితంగా జరిగాయని తెలిపింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు కొన్ని మార్పులు చేసింది. 2016లో నియామకం అయినప్పటి నుంచి పొందిన జీతాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును మాత్రం సుప్రీం ధర్మాసనం సవరించింది. అలా జీతం ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్పీంకోర్టు స్పష్టం చేసింది. ఇక మూడు నెలల్లోపు కొత్త ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.
తాజాగా సుప్రీంకోర్టు తీర్పును మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ తీర్పును అంగీకరించబోనని ప్రతిజ్ఞ బూనారు.
తాజావార్తలు
-
Vladimir Putin: పుతిన్కు ప్రాణగండం? రష్యాలో సైనిక తిరుగుబాటుకు స్కెచ్!
-
Kakarla Krishna : టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత!
-
RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
-
Rohit Sharma Lady Fan: అభిమాని కోసం వెయిట్ చేసిన రోహిత్ శర్మ.. తబ్బిబైపోయిన యువతి, వీడియో వైరల్!!
-
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ షూటింగ్ అప్డేట్..