Kharge vs BJP: మోడీ టెర్రరిస్ట్.. ఖర్గే వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
- మోడీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు
- కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు
- చర్యలు తీసుకోవాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీని ఉద్దేశిస్తూ ‘టెర్రరిస్ట్’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, నిర్మలా సీతారామన్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖర్గే వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, పరువు నష్టం కలిగించే చర్య అని, ఎన్నికలను ప్రభావితం చేయగల తీవ్రమైన ఆరోపణ అని పేర్కొంది. ఖర్గేపై చర్య తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.
ఫిర్యాదులో ఏముందంటే..
మోడీని ‘‘ఉగ్రవాది’’ అని పిలవడం వ్యక్తిగత దూషణ, తీవ్రమైన వ్యక్తిగత దాడి, ప్రజల ప్రజాస్వామ్య ఎంపికను ప్రభావితం చేసే ప్రయత్నమని బీజేపీ పేర్కొంది. ఈ వ్యాఖ్య భారత శిక్షా స్మృతి (ఐపీసీ), 2023లోని సెక్షన్లు 175, 171/174 (అనుచిత ప్రభావం), 356(1) (పరువు నష్టం)తో సహా వివిధ సెక్షన్ల కింద శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుందని తెలిపింది. ఈ వ్యాఖ్యను తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ/ఉపసంహరణ జారీ చేయాలని, అవసరమైన ఎన్నికల ఆంక్షలు విధించాలని, అభ్యంతరకరమైన సమాచారం వ్యాప్తిని నిషేధించాలని ఆ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది.
Also Read
అమిత్ షా ఖండన..
‘‘కాంగ్రెస్ పార్టీ తన ప్రవర్తనలో రోజురోజుకీ మరింత దిగజారుతూ ప్రజా చర్చల స్థాయిని తగ్గించడంలో తన సొంత రికార్డులనే బద్దలు కొడుతోంది. ఖర్గే.. ప్రజా ప్రవర్తనా ప్రమాణాలన్నింటినీ ఉల్లంఘిస్తూ.. భారతదేశం ఎన్నుకున్న ప్రధానమంత్రి మోడీని ఉగ్రవాది అని పిలిచి దేశాన్ని అవమానించారు. దేశ అత్యున్నత నాయకుడికి జరిగిన ఈ అవమానం.. మోడీని ప్రేమించి, మద్దతిచ్చే లక్షలాది మంది ప్రజలకు జరిగిన అవమానం.’’ అని అన్నారు. గత 12 ఏళ్లలో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించిన మోడీ లాంటి నాయకుడిని ఉగ్రవాది అని పిలవడం తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు.
We have filed a strong complaint against Congress President Shri @kharge ji for his shocking and disgraceful remark calling Hon’ble PM Shri @narendramodi ji a “terrorist.”
This is not just derogatory, it is a dangerous & unprecedented attack on democratic institutions.
A blatant… pic.twitter.com/xtJWCoS79Z— Kiren Rijiju (@KirenRijiju) April 21, 2026
Every day, the Congress is hitting new lows in its demeanour, breaking its own record in lowering the standard of public discourse. Today, Congress President Mallikarjun Kharge Ji breached every standard of public conduct and brought shame to the nation by calling the elected…
— Amit Shah (@AmitShah) April 21, 2026
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!