Mallikarjun Kharge: ఆపరేషన్ సిందూర్ ‘‘చిన్న యుద్ధం’’.. మోడీకి ఉగ్రదాడి గురించి ముందే తెలుసు..
- ఆపరేషన్ సిందూర్ ‘‘చిన్న యుద్ధం’’..
- ప్రధాని మోడీకి పహల్గామ్ ఉగ్రదాడి గురించి ముందే తెలుసు..
- కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు రక్షించడంతో కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ‘‘చిన్న యుద్ధం’’ అని అభివర్ణించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ముందే ప్రధాని నరేంద్రమోడీకి సమాచారం ఉందని ఆరోపించారు. ఆ తర్వాతే ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారని ఖర్గే మరోసారి అన్నారు. దాడి జరిగే అవకాశం ఉందని ప్రజలకు ముందే ఎందుకు తెలియజేయలేదు అని ప్రశ్నించారు.
కర్ణాటకలో జరిగిన సమర్పణే సంకల్ప ర్యాలీలో పాల్గొన్న ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఏప్రిల్ 17న కాశ్మీర్లో పర్యటించి ఉండాల్సింది, కానీ నిఘా వర్గాల సమాచారం మేరకు రద్దు చేసుకున్నారని, దీని గురించి మీకు ముందే తెలుసా..? అని ప్రధానిని ప్రశ్నించారు. దీని గురించి ఎందుకు ప్రజలకు సమాచారం ఇవ్వలేదు, ముందే హెచ్చరించి ఉంటే 26 మంది ప్రాణాలను కాపాడగలిగే వాళ్లం అని అన్నారు. ‘‘ఇప్పుడు అక్కడక్కడ చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ చైనా మద్దతుతో భారతదేశాన్ని తక్కువ అంచనా వేస్తోంది’’ అని అన్నారు.
Also Read
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
Read Also: Turkey: టర్కీ, అజర్బైజాన్లకు షాక్ ఇస్తున్న భారతీయులు..
“26 మంది పౌరులు మరణించగా, ప్రధాని మోదీ బీహార్లో ర్యాలీ నిర్వహించడంలో బిజీగా ఉన్నారు. రెండు అఖిలపక్ష సమావేశాలు జరిగాయి, ప్రధానమంత్రి కూడా హాజరు కాలేదు. మేము ఆ సమావేశాలకు దూరంగా ఉంటే, మమ్మల్ని దేశద్రోహులుగా పిలుస్తారు. కానీ మోదీ వాటిని సమావేశాలకు రాకుంటే, దానిని దేశభక్తిగా ముద్ర వేస్తారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?” అని ఖర్గే ప్రశ్నించారు.
ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా తీవ్రంగా స్పందించారు. దేశాన్ని, సాయుధ దళాల ధైర్యాన్ని మోసం చేయడమే అని అన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్ ఒక చిన్న యుద్ధం అని ఖర్గే జీ చెబుతున్నారు. మన సాయుధ దళాలు పాకిస్తాన్లోకి ప్రవేశించి అక్కడ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశాయని, 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని రాహుల్ గాంధీ, ఖర్గే జీ అర్థం చేసుకోలేకపోతున్నారా? పాకిస్తాన్ 11 వైమానిక స్థావరాలు ధ్వంసం అయ్యాయి, నేడు పాకిస్తాన్ బాధతో ఏడుస్తోంది.’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
-
Forbes India: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!