Satyapal Malik: మహారాష్ట్ర బీజేపీ “శవపేటిక”కు చివరి మేకు అవుతుంది.
- మహరాష్ట్ర బీజేపీ శవపేటికకు చివరి మేకు..
- మహా ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది..
- కమలం పార్టీపై విరుచుకుపడిన జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyapal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ శవపేటికకు మహారాష్ట్ర చివరి మేకు అవుతుందని ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శనివారం అన్నారు. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. హర్యానాలో పాటు మహారాష్ట్రకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉందని, అయితే ఓటమి భయంతోనే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మాదిరిగానే వీటిని కూడా వాయిదా వేశారని మాలిక్ అన్నారు.
Read Also: EY Employee Death: అన్నా సెబాస్టియన్ మరణంపై నివేదిక కోరిన హ్యుమన్ రైట్స్ సంస్థ..
Also Read
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
- Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
బీజేపీ వ్యవసాయాన్ని, ఉపాధిని అంతం చేయాలని చూస్తున్నారు, అయితే ఈ దేశ ప్రజలు వారి పాలనను అంతం చేస్తారని, మహారాష్ట్రపై తనకు చాలా ఆశలు ఉన్నాయని, ఈ రాష్ట్రం దేశానికి మార్గాన్ని చూపిస్తుందని చెప్పారు. రైతుల నిరసన, పుల్వామా ఘటనపై బీజేపీ తీరుని సత్యపాల్ మాలిక్ గతంలో విమర్శించారు. ఇంటెలిజెన్స్ తప్పిదాల వల్లే ఈ ఘటన జరిగిందని తాను చెబితే, ప్రధాని మోడీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తనను మౌనంగా ఉండాలని కోరారని, ఈ ఘటనపై వారు దర్యాప్తు చేస్తారని అనుకున్నా, కానీ దానిని ప్రధాని ఎన్నికల అంశంగా మార్చారని చెప్పారు. కనీసం ఇప్పటికైనా కేంద్రం విచారణ జరిపించి, మన జవాన్లకు న్యాయం చేయాలని కోరారు. పుల్వామా దాడుల గురించి ప్రశ్నించడంతోనే తనపై , తన వాళ్లపై సీబీఐ, ఈడీలు దాడి చేస్తున్నాయని చెప్పొకొచ్చారు.
ఈ సమావేశంలో పాల్గొన్న శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కూడా బీజేపీపై విరుచుకుపడ్డారు. ఈ రోజు మనం చూస్తున్న మోడీ 10 ఏళ్ల క్రితం నాటి మోడీ కాదని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి 180 సీట్లు మించవని వారికి తెలుసు, హోం మంత్రి జిల్లా కలెక్టర్ల సాయంతో ద్వారా మిగతా సీట్లు సాధించిందని ఆరోపించారు. మహారాష్ట్రలో జరిగే ఎన్నికలలో మనం గెలిచిన రోజు మోడీ ప్రధానిగా చివరి రోజు అవుతుందని, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటారని జోస్యం చెప్పాడు. 2002 గోద్రా అల్లర్లు దేశంలో మొట్టమొదటి పుల్వామా దాడి అని, మోదీ హయాంలో దేశం ఇలాంటి పుల్వామా దాడులను చూసిందని అన్నారు.
తాజావార్తలు
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?