EY Employee Death: అన్నా సెబాస్టియన్ మరణంపై నివేదిక కోరిన హ్యుమన్ రైట్స్ సంస్థ..
- పని ఒత్తిడితో మరణించిన అన్నా సెబాస్టియన్ పెరాయిల్..
- దేశవ్యాప్తంగా కార్పొరేట్ కల్చర్పై అనుమానాలకు కారణమైన యువతి మరణం..
- అన్నా మరణంపై నివేదిక కోరిన జాతీయ మానవ హక్కుల కమిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EY Employee Death: ఎర్నెస్ట్ అండ్ యంగ్లో సీఏగా పనిచేస్తున్న 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ పెరాయిల్ మరణం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కార్పొరేట్ రంగంలో పని ఒత్తిడి ఎలా ఉంటుందనే విషయాలను ఆమె మరణం వెలుగులోకి తెచ్చింది. తన కూతురు ‘‘పని ఒత్తిడి’’తో మరణించిందని అన్నా తల్లి ఆరోపించడంతో ఈ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆఫీసులోనే తీవ్ర అస్వస్థతకు గురైన అన్నా, చికిత్స పొందుతూ మరణించింది. తన కూతురు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా పని చేసేదని, తినడానికి, నిద్ర పోవడానికి కూడా సమయం దొరికేది కాదని ఆమె తండ్రి సిబి జోసెఫ్ కన్నీటి పర్యంతమయ్యాడు.
Read Also: IND vs BAN: అశ్విన్ గురించి ఏం చెప్పాలి.. ప్రతిసారీ అతడివైపే చూస్తాం: రోహిత్
Also Read
- FSSAI Liquor Notices: బీర్, విస్కీ, రమ్, తాగుతున్నారా?.. ఇది మీకోసమే..!
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
తాజాగా ఈ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) నివేదిక కోరింది. అన్నా సెబాస్టియన్ మరణానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖలను కోరింది. “ప్రతి యజమాని తన ఉద్యోగులకు సురక్షితమైన, సురక్షితమైన మరియు సానుకూల వాతావరణాన్ని అందించడానికి ప్రధాన విధిని కలిగి ఉంటాడు. వ్యాపారాలు మానవ హక్కుల పట్ల వారి నిబద్ధతను ప్రతిబింబించేలా వారి ఉపాధి విధానాలను క్రమం తప్పకుండా నవీకరించడం మరియు సవరించడం చాలా ముఖ్యమైనది” హ్యూమర్ రైట్స్ కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఉద్యోగంలో చేరిన నాలుగు నెలలకే పని ఒత్తిడితో అన్నా సెబాస్టియన్ మరణించడం దేశవ్యాప్తంగా కార్పొరేట్ కల్చర్పై ఆందోళన రేకెత్తించాయి. ఆమె మరణం తర్వాత చాలా మంది ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ మీడియా ద్వారా హైలెట్ చేశారు. ఒకరు కార్పొరేట్ ఉద్యోగం కష్టమని చెబితే, మరొకరు తన సీనియర్ నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పారు. పెరాయిల్ గుండెపోటుతో మరనించినట్లు నివేదించబడిన నేపథ్యంలో తాము ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Meher Ramesh : నటుడుగా రీ – ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ మెహర్ రమేష్
-
FSSAI Liquor Notices: బీర్, విస్కీ, రమ్, తాగుతున్నారా?.. ఇది మీకోసమే..!
-
School Bandh: నేడు పాఠశాలలు బంద్.. వరుసగా మూడు రోజుల సెలవులు!
-
Vaibhav Sooryavanshi: “ఆ బుడ్డోడిని ఎలా దెబ్బకొట్టాలో మాకు తెలుసు”.. ఇంగ్లాండ్ దిగ్గజాల సంచలన కామెంట్స్!
-
Senior Hero : సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్న హీరో
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!