Satyapal Malik: మహారాష్ట్ర బీజేపీ “శవపేటిక”కు చివరి మేకు అవుతుంది.
- మహరాష్ట్ర బీజేపీ శవపేటికకు చివరి మేకు..
- మహా ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది..
- కమలం పార్టీపై విరుచుకుపడిన జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyapal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ శవపేటికకు మహారాష్ట్ర చివరి మేకు అవుతుందని ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శనివారం అన్నారు. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. హర్యానాలో పాటు మహారాష్ట్రకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉందని, అయితే ఓటమి భయంతోనే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మాదిరిగానే వీటిని కూడా వాయిదా వేశారని మాలిక్ అన్నారు.
Read Also: EY Employee Death: అన్నా సెబాస్టియన్ మరణంపై నివేదిక కోరిన హ్యుమన్ రైట్స్ సంస్థ..
Also Read
- UAPA Terrorists List: మరో కఠిన నిర్ణయం.. 23 మంది పేర్లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన కేంద్రం
- Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
- Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
- Centre Orders Google, Apple: ప్రయాణికుల భద్రతకు ముప్పు.. గూగుల్, యాపిల్కు కేంద్రం కీలక ఆదేశాలు
బీజేపీ వ్యవసాయాన్ని, ఉపాధిని అంతం చేయాలని చూస్తున్నారు, అయితే ఈ దేశ ప్రజలు వారి పాలనను అంతం చేస్తారని, మహారాష్ట్రపై తనకు చాలా ఆశలు ఉన్నాయని, ఈ రాష్ట్రం దేశానికి మార్గాన్ని చూపిస్తుందని చెప్పారు. రైతుల నిరసన, పుల్వామా ఘటనపై బీజేపీ తీరుని సత్యపాల్ మాలిక్ గతంలో విమర్శించారు. ఇంటెలిజెన్స్ తప్పిదాల వల్లే ఈ ఘటన జరిగిందని తాను చెబితే, ప్రధాని మోడీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తనను మౌనంగా ఉండాలని కోరారని, ఈ ఘటనపై వారు దర్యాప్తు చేస్తారని అనుకున్నా, కానీ దానిని ప్రధాని ఎన్నికల అంశంగా మార్చారని చెప్పారు. కనీసం ఇప్పటికైనా కేంద్రం విచారణ జరిపించి, మన జవాన్లకు న్యాయం చేయాలని కోరారు. పుల్వామా దాడుల గురించి ప్రశ్నించడంతోనే తనపై , తన వాళ్లపై సీబీఐ, ఈడీలు దాడి చేస్తున్నాయని చెప్పొకొచ్చారు.
ఈ సమావేశంలో పాల్గొన్న శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కూడా బీజేపీపై విరుచుకుపడ్డారు. ఈ రోజు మనం చూస్తున్న మోడీ 10 ఏళ్ల క్రితం నాటి మోడీ కాదని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి 180 సీట్లు మించవని వారికి తెలుసు, హోం మంత్రి జిల్లా కలెక్టర్ల సాయంతో ద్వారా మిగతా సీట్లు సాధించిందని ఆరోపించారు. మహారాష్ట్రలో జరిగే ఎన్నికలలో మనం గెలిచిన రోజు మోడీ ప్రధానిగా చివరి రోజు అవుతుందని, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటారని జోస్యం చెప్పాడు. 2002 గోద్రా అల్లర్లు దేశంలో మొట్టమొదటి పుల్వామా దాడి అని, మోదీ హయాంలో దేశం ఇలాంటి పుల్వామా దాడులను చూసిందని అన్నారు.
తాజావార్తలు
-
UAPA Terrorists List: మరో కఠిన నిర్ణయం.. 23 మంది పేర్లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన కేంద్రం
-
Jr NTR-Akhil: ‘లెనిన్’ కోసం రంగంలోకి ఎన్టీఆర్?.. అక్కినేని అఖిల్కు బూస్ట్ ఇచ్చే స్పెషల్ ప్లాన్!
-
Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
-
RBI: విదేశీ మారక, బంగారు నిల్వలు భారీ పతనం.. ఆర్బీఐ తాజా గణాంకాలు
-
Netflix: పరిచయాలు అవసరం లేదు.. మంచి కథ ఉంటే నెట్ఫ్లిక్స్లో గోల్డెన్ ఛాన్స్
ట్రెండింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో