Maharashtra Temple Tragedy: పర్భణిలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Temple Tragedy: మహారాష్ట్రలోని పర్భణి జిల్లా మానవత్ తహసీల్ పరిధిలో ఉన్న ప్రసిద్ధ యశ్వడి మారుతి ఆలయంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆలయం ముందు నిర్మించిన సభా మండపం అకస్మాత్తుగా కూలిపోవడంతో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. ప్రమాద సమయంలో ఆలయంలో మతపరమైన కార్యక్రమాలు, కీర్తనలు జరుగుతుండగా పెద్ద సంఖ్యలో భక్తులు మండపంలో ఉన్నారు. పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో సుమారు 30 నుంచి 40 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
పలువురికి తీవ్ర గాయాలు
ఈ ప్రమాదంలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆర్.పీ. ఆసుపత్రితో పాటు సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని తరలించేందుకు అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచారు.
Also Read
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
- Air India: గాల్లో హడలెత్తించిన ఎయిర్ ఇండియా విమానం.. అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు జారిపోయిన ఫ్లైట్..
- ఒకే రీఛార్జ్లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
నిర్మాణ పనులపై అనుమానాలు
అయితే, ఘటనా స్థలం నుంచి వెలువడిన ఫోటోలు, వీడియోల ఆధారంగా మండపం నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని జిల్లా అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని బ్లాక్ చేసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు.. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. హనుమాన్ ఆలయం ఉండటం, శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.. కార్యక్రమం జరుగుతుండగా, మండపం పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఉండడంతో.. ఆరుగురు మృతిచెందారు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
-
Food Facts: చిల్లు గారెలో చిల్లు ఎందుకు పెడతారో తెలుసా? దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
-
Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!