Site icon NTV Telugu

Election Schedule: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో మోగిన ఎన్నికల నగారా.. పోలింగ్ ఎప్పుడంటే..!

Cec

Cec

దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.  మహారాష్ట్రలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 20న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న వెలువడనున్నాయి. ఇక జార్ఖండ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 13, 20న పోలింగ్.. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదలకానున్నాయి.

నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుండగా.. జార్ఖండ్‌లో 2025, జనవరి 5తో కాలపరిమితి ముగుస్తుంది. మహారాష్ట్రలో 288 స్థానాలు ఉండగా.. 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2.6 కోట్ల మంది ఓటర్లున్నారు.

హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో విజయవంతంగా పోలింగ్ ముగిసినట్లు సీఈసీ రాజీవ్‌కుమార్ తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో అయితే ఎలాంటి హింస జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని స్పష్టం చేశారు. ఇటీవలే హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. హర్యానాలో బీజేపీ విజయం సాధించగా.. జమ్మూకాశ్మీర్‌లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి గెలిచింది. కానీ ఇంకా ఎక్కడ కొత్త ప్రభుత్వాలు ఏర్పడలేదు.

Exit mobile version