Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు అంతా సిద్ధం..
- మహారాష్ట్ర, జార్ఖండ్ ఓట్ల లెక్కింపుకు అంతా సిద్ధం..
- ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం..
- గెలుపుపై బీజేపీ, కాంగ్రెస్ కూటముల ధీమా..
Election Results: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల కోసం దేశం ఎదురుచూస్తోంది. ఈ రోజు ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. లోక్సభ, హర్యానా ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఉదయం 11 గంటల వరకు ఎవరు గెలుస్తున్నారనే విషయంపై స్పష్టత రానుంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు:
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 288 స్థానాల్లో 4138 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో 3239 మంది నిలువగా, ఈసారి సంఖ్య పెరిగింది. ఈ రాష్ట్రంలో రెండు కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ నేతృత్వంలోని ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీనీలు ‘‘మహాయుతి’’ కూటమిగా పోటీ చేశాయి. మరోవైపు ప్రతిపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమిలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలు ఉన్నాయి. మహారాష్ట్రలో అధికారం నిలుపుకోవాలని బీజేపీ కూటమి భావిస్తుంటే, లోక్సభ ఎన్నికల ఫలితాలు పునరావృతం చేయాలని ఎంవీఏ అనుకుంటోంది. ఓట్ జిహాద్, అభివృద్ధి నినాదాలతో పాటు యోగి ఆదిత్యనాథ్ ‘‘బాటేంగేతో కటేంగే’’, మోడీ ‘‘ఏక్ హైతో సేఫ్ హై’’ అనే నినాదాలు ప్రచారంలో ప్రముఖ పాత్ర పోషించాయి. మరోవైపు కాంగ్రెస్ కూటమి ‘‘కులగణన’’, రాజ్యాంగ పరిరక్షణ అనే అంశాలను తెరపైకి తెచ్చింది.
జార్ఖండ్ ఎన్నికలు:
జార్ఖండ్లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 43 స్థానాల్లో 683 మంది పోటీ చేశారు. రెండో విడుతలో 38 స్థానాలకు గానూ 528 మంది పోటీలో నిలబడ్డారు. మొత్తంగా 1211 మంది పోటీ చేశారు. బీజేపీ నేతృత్వంలో ఏజేఎస్యూ, జేడీయూ పార్టీలు ఎన్డీయే కూటమిగా పోటీ చేశాయి. మరోవైపు అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి పోటీ చేస్తున్నాయి. బంగ్లాదేశ్ చొరబాట్లు, ఆదివాసీ హక్కులపై ఎన్నికల ప్రచారం నడిచింది.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?