Mahakumbh Mela 2025: నేటితో ముగియనున్న కుంభమేళా.. పవిత్ర స్నానాల కోసం పోటెత్తిన భక్తులు
- నేటితో ముగియనున్న కుంభమేళా
- దాదాపు 62 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు
- భారత వైమానిక దళం మహాకుంభమేళా ప్రాంతంలో అద్భుతమైన వైమానిక ప్రదర్శన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా నేటితో ముగియనున్నది. జనవరి 13 (పౌష్ పూర్ణిమ)న ప్రారంభమైన కుంభమేళా నేడు మహాశివరాత్రితో(ఫిబ్రవరి 26) ముగియనున్నది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, దిగ్గజ వ్యాపారస్తులు, కుంభమేళాకు హాజరయ్యారు. దాదాపు 62 కోట్లకు పైగా భక్తులు గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
Also Read:Bangladesh: యూనస్, పాక్ జోక్యంపై బంగ్లా ఆర్మీ చీఫ్ అసహనం.. తిరుగుబాటు తప్పదా..?
Also Read
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
మహాకుంభమేళా కోసం యూపీ సర్కార్ అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంది. ఇందుకోసం కోట్లు వెచ్చించింది. కాగా కుంభమేళా ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వచ్చింది. అయితే కుంభమేళాకు భక్తుల తాకిడి ఎక్కువ అవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. స్వల్ప అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడ్డారు. మొత్తానికి మహాకుంభమేళా ప్రపంచాన్ని ఆకర్షించింది.
Also Read:Eluru: శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి.. తమ్మిలేరులో ఇద్దరు గల్లంతు
బుధవారం మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. “హర్ హర్ మహాదేవ్” మంత్రోఛ్చారణలతో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. తెల్లవారుజామున 2 గంటల సమయానికి మహా శివరాత్రి నాడు 11.66 లక్షలకు పైగా భక్తులు సంగమంలో పుణ్యస్నానాలు చేశారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. తరువాతి రెండు గంటల్లోనే ఈ సంఖ్య 25.64 లక్షలకు పెరిగింది, ఉదయం 6 గంటల నాటికి 41.11 లక్షలకు పెరిగిందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ఒక్కరోజే 81.09 లక్షల మంది భక్తులు పవిత్రస్నానాలు చేశారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహాకుంభమేళా ముగింపు రోజున భారత వైమానిక దళం మహాకుంభమేళా ప్రాంతంలో అద్భుతమైన వైమానిక ప్రదర్శనను నిర్వహించింది.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!