Maha kumbh mela: ఇంకా తీరని ట్రాఫిక్ కష్టాలు.. నిండుకున్న పెట్రోల్, ఆహారం.. భక్తులు అవస్థలు
- మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
- 72 గంటలుగా ప్రయాగ్రాజ్లో వాహనాల రద్దీ
- ఇంకా తీరని ట్రాఫిక్ కష్టాలు
- నిండుకున్న పెట్రోల్, ఆహారం
- కనీస అవసరాలు తీరక భక్తులు అవస్థలు
- పాలు, చక్కెర.. నిత్యావసర వస్తువులన్నీ నిల్
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వాహనాల రద్దీ కొనసాగుతోంది. గత ఆదివారం నుంచి ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఊహించని రీతిలో భక్తులు తరలిరావడంతో దాదాపు 350 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు గానీ.. వాహనాలు గానీ కదిలే పరిస్థితులు లేవు. ఇంకో వైపు ప్రయాగ్రాజ్లో ఆహార వస్తువులు నిండుకున్నాయి. అంతేకాకుండా అన్ని పెట్రోల్ బంకులోనూ ఇంధన కొరత ఏర్పడింది. వాహనాలు కదిలే పరిస్థితి లేక పెట్రోల్ ట్యాంకులు కదిలే పరిస్థితి లేదు.. అలాగే ఆహార వస్తువులు కూడా లోపలికి వచ్చే మార్గం లేదు. దీంతో స్థానిక ప్రజలతో పాటు కోట్లాదిగా తరలివచ్చిన భక్తులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Tiger Roaming: కాటారంలో పెద్దపులి సంచారం కలకలం.. భయాందోళనలలో ప్రజలు!
Also Read
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
ఇక మూడు రోజుల నుంచి యూపీలోని అనేక ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. ఇక కొత్తగా వచ్చే వాహనాలకు అనుమతి ఇవ్వడమే లేదు. ఆయా రాష్ట్రాల బోర్డర్లోనే వాహనాలు నిలిపివేశారు. ఈ ట్రాఫిక్ నియంత్రణ కావడానికి మరో మూడు రోజుల వరకు సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు.
ప్రస్తుతం యూపీలో పిండి, పప్పులు, చక్కెర వంటి నిత్యావసర వస్తువులన్నీ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక 50 పెట్రోల్ బంకులు వరకు మూసివేశారు. రవాణా సౌకర్యం మెరుగుపడ్డాకే.. పెట్రోల్ ట్యాంకులు లోపలికి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు వాహనదారులు ఇబ్బంది పడాల్సిందే. ఇక ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. భారీ ధరలతో అమ్ముతున్నారు. భక్తులు కూడా కొనే పరిస్థితులు లేవు. పాల ఉత్పత్తులు కూడా బాగా తగ్గిపోయాయి. పడవ సేవలు కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా కొన్ని గంటల పాటు పడవ సేవలు నిలిపివేశారు. దీంతో భక్తులు చాలా అసౌకర్యానికి గురయ్యారు.
ట్రాఫిక్ నియంత్రణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. వాహనాల రాకపోకలు సులభతరం చేయడానికి.. భక్తుల రద్దీని నియంత్రించడానికి అదనపు పోలీసు బలగాలను మోహరింపజేస్తున్నామని డీజీపీ తెలిపారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Police Notice to YCP central Office: వైసీపీ కేంద్ర కార్యాలయానికి మరోసారి పోలీసుల నోటీసులు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!