Maha Kumbha Mela: కుంభమేళ భక్తుల్ని దోచుకుంటున్న విమాన సంస్థలు..
- మహా కుంభ మేళ భక్తుల్ని దోచుకుంటున్న విమాన సంస్థలు..
- వెళ్లి రావడానికి టికెట్ ధరలు రూ. 50000 కన్నా పైమాటే..
- చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన డీజీసీఏ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbha Mela: హిందువులు ఆధ్యాత్మిక కార్యక్రమం ‘‘మహా కుంభ మేళా’’కి వెళ్లే భక్తులను విమానయాన సంస్థలు దోచుకుంటున్నాయి. హిందువులు ఒక్కసారైన కుంభమేళకు వెళ్లాలని భావిస్తుంటారు. ఈ అవకాశాన్ని ఎయిర్లైనర్లు ఉపయోగించుకుంటున్నాయి. ప్రయాగ్రాజ్తో పాటు కుంభమేళకు సమీపంలో ఉన్న వారణాసి, లక్నో, అయోధ్యలకు టికెట్ ధరల్ని అమాంతంగా పెంచాయి. సామాన్యుడు ఈ టికెట్ల ధరల్ని చూసి, విమానం ఎక్కే పరిస్థితి లేదు. ఈ టికెట్ల రేట్ల కన్నా బ్యాంకాక్, మాల్దీవుల వంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్లి వచ్చేందుకు టికెట్ రేట్లు చాలా తక్కువ ఉండటం గమనార్హం.
న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూర్, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాల నుంచి కుంభమేళాకు వెళ్లాలంటే ఒక్కోక్కరు సుమారుగా రూ. 30000 చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. రానుపోనూ ఖర్చులు ఒకరికి రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు ఉంటున్నాయి. మహాకుంభమేళలో కీలక పుణ్య స్నానాల రోజులైన మౌని అమావాస్య స్నాన్ (జనవరి 29), బసంత్ పంచమి (ఫిబ్రవరి 3), మాఘి పూర్ణిమ (ఫిబ్రవరి 12), మరియు మహాశివరాత్రి (ఫిబ్రవరి 26) వంటి రోజుల్లో టికెట్ ధరలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
Read Also: Sangareddy: ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించిన భార్య..
విమానయాన సంస్థలు టికెట్ రేట్లను పెంచడంపై డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) స్పందించింది. మహా కుంభ మేళ సమయంలో ప్రయాగ్ రాజ్కి విమాన ఛార్జీలను హేతుబద్ధీకరించాలని కోరింది. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా డీజీసీఏ జనవరిలో 81 అదనపు విమానాలను ఆమోదించింది. దేశవ్యాప్తంగా ప్రయాగ్రాజ్ ఎయిర్ కనెక్టివిటీ 132 విమానాలకు పెంచింది.
భక్తుల కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం భద్రత, సౌకర్యాలను, అనేక సంస్థలు దాతృత్వ సేవల్ని నిస్వార్థంగా చేస్తుంటే, విమానయాన సంస్థలు మాత్రం ప్రయాణికులను నిలువుదోపిడి చేస్తున్నాయని వీహెచ్పీ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ విమర్శించారు.
హైదరాబాద్-ప్రయాగ్ రాజ్ రూట్లో టికెట్ ధర సుమారుగా రూ. 27 వేలు- రూ. 31 వేలుగా ఉంది. చెన్నై నుంచి ప్రయాగ్ రాజ్కి ఒక్క ఫ్లైట్ టికెట్ ధర సుమారుగా రూ. 21 వేలు-రూ. 32 వేలుగా ఉంది. బెంగళూర్ నుంచి కూడా ఇదే తరహా రేట్లు ఉన్నాయి. సాధారణంగా మామూలు రోజుల్లో ఒక్కో టికెట్ కేవలం రూ. 6000- రూ.8000 మధ్యలో ఉంటుంది. ఢిల్లీ నుంచి ఈ ధరలు రూ. 15 వేలు- రూ. 22 వేల మధ్యలో ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఇది కేవలం రూ. 5000 ఉంటుంది.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!