Maha Kumbha Mela: కుంభమేళ భక్తుల్ని దోచుకుంటున్న విమాన సంస్థలు..
- మహా కుంభ మేళ భక్తుల్ని దోచుకుంటున్న విమాన సంస్థలు..
- వెళ్లి రావడానికి టికెట్ ధరలు రూ. 50000 కన్నా పైమాటే..
- చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన డీజీసీఏ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbha Mela: హిందువులు ఆధ్యాత్మిక కార్యక్రమం ‘‘మహా కుంభ మేళా’’కి వెళ్లే భక్తులను విమానయాన సంస్థలు దోచుకుంటున్నాయి. హిందువులు ఒక్కసారైన కుంభమేళకు వెళ్లాలని భావిస్తుంటారు. ఈ అవకాశాన్ని ఎయిర్లైనర్లు ఉపయోగించుకుంటున్నాయి. ప్రయాగ్రాజ్తో పాటు కుంభమేళకు సమీపంలో ఉన్న వారణాసి, లక్నో, అయోధ్యలకు టికెట్ ధరల్ని అమాంతంగా పెంచాయి. సామాన్యుడు ఈ టికెట్ల ధరల్ని చూసి, విమానం ఎక్కే పరిస్థితి లేదు. ఈ టికెట్ల రేట్ల కన్నా బ్యాంకాక్, మాల్దీవుల వంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్లి వచ్చేందుకు టికెట్ రేట్లు చాలా తక్కువ ఉండటం గమనార్హం.
న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూర్, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాల నుంచి కుంభమేళాకు వెళ్లాలంటే ఒక్కోక్కరు సుమారుగా రూ. 30000 చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. రానుపోనూ ఖర్చులు ఒకరికి రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు ఉంటున్నాయి. మహాకుంభమేళలో కీలక పుణ్య స్నానాల రోజులైన మౌని అమావాస్య స్నాన్ (జనవరి 29), బసంత్ పంచమి (ఫిబ్రవరి 3), మాఘి పూర్ణిమ (ఫిబ్రవరి 12), మరియు మహాశివరాత్రి (ఫిబ్రవరి 26) వంటి రోజుల్లో టికెట్ ధరలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి.
Also Read
- Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
- Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
- Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
- Twisha Sharma: దేహమంతా గాయాలే.. తెలుగు నటి పోస్ట్మార్టంలో షాకింగ్ విషయాలు
Read Also: Sangareddy: ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించిన భార్య..
విమానయాన సంస్థలు టికెట్ రేట్లను పెంచడంపై డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) స్పందించింది. మహా కుంభ మేళ సమయంలో ప్రయాగ్ రాజ్కి విమాన ఛార్జీలను హేతుబద్ధీకరించాలని కోరింది. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా డీజీసీఏ జనవరిలో 81 అదనపు విమానాలను ఆమోదించింది. దేశవ్యాప్తంగా ప్రయాగ్రాజ్ ఎయిర్ కనెక్టివిటీ 132 విమానాలకు పెంచింది.
భక్తుల కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం భద్రత, సౌకర్యాలను, అనేక సంస్థలు దాతృత్వ సేవల్ని నిస్వార్థంగా చేస్తుంటే, విమానయాన సంస్థలు మాత్రం ప్రయాణికులను నిలువుదోపిడి చేస్తున్నాయని వీహెచ్పీ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ విమర్శించారు.
హైదరాబాద్-ప్రయాగ్ రాజ్ రూట్లో టికెట్ ధర సుమారుగా రూ. 27 వేలు- రూ. 31 వేలుగా ఉంది. చెన్నై నుంచి ప్రయాగ్ రాజ్కి ఒక్క ఫ్లైట్ టికెట్ ధర సుమారుగా రూ. 21 వేలు-రూ. 32 వేలుగా ఉంది. బెంగళూర్ నుంచి కూడా ఇదే తరహా రేట్లు ఉన్నాయి. సాధారణంగా మామూలు రోజుల్లో ఒక్కో టికెట్ కేవలం రూ. 6000- రూ.8000 మధ్యలో ఉంటుంది. ఢిల్లీ నుంచి ఈ ధరలు రూ. 15 వేలు- రూ. 22 వేల మధ్యలో ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఇది కేవలం రూ. 5000 ఉంటుంది.
తాజావార్తలు
-
Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ సేల్ స్టార్ట్.. రూ. 10000 డిస్కౌంట్! 6,000mAh బ్యాటరీ, 8.1-అంగుళాల స్క్రీన్
-
Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
-
Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
-
WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్టాప్ బహుకరించిన మెగాస్టార్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!