Madras High Court: దేవుడి ముందు అందరూ సమానమే.. VIP దర్శనాలు ఎందుకు?
- దేవుడి ముందు అందరూ సమానమే: మద్రాస్ హైకోర్టు
- VIP దర్శనాలపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు
- “దేవుడు VIPల కోసం ఎదురుచూడాలా?” అంటూ ప్రశ్న
- మంత్రులు, ఎమ్మెల్యేల ప్రత్యేక దర్శనాలపై అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madras High Court: ఆలయాల్లో కొనసాగుతున్న VIP దర్శనాలపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేవుడి ముందు అందరూ సమానమే అని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా దేవాలయాల్లోకి వెళ్లి ప్రత్యేక దర్శనాలు చేయించుకోవడం మంచిది కాదని కోర్టు స్పష్టం చేసింది. VIPల కోసం దేవుడు ఎదురుచూస్తూ ఉండాలా.? అని ఘాటుగా ప్రశ్నించింది. జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ వి లక్ష్మీనారాయణన్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
హైకోర్టులో ఈ అంశంపై విశ్వ హిందూ పరిషత్ ఉత్తర తమిళనాడు విభాగం అధ్యక్షుడు పి. చొక్కలింగం దాఖలు చేశారు. ఆలయాల్లో వీఐపీ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. అయితే వృద్ధులు, వికలాంగులు, గర్భిణిలు, కొత్తగా వివాహం జరిగిన జంటలకు, రాష్ట్రపతి వంటి రాజ్యాంగబద్ధ హోదా కలిగిన వారికి మినహాయింపు ఇవ్వవచ్చని పిటిషన్లో పేర్కొన్నారు.
Also Read
- Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
- Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
- ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
- Shehzad Poonawalla: బీజేపీకి షాజాద్ పూనావాలా రాజీనామా..
మే 15న తిరుపరంకుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయంలో ఒక మంత్రి దర్శనం కోసం ఆలయ సమయాన్ని పొడగించారనే ఆరోపణలపై కోర్టు గతంలో వివరణ కోరింది. అయితే ఆలయ సమయాన్ని పొడగించలేదని తమిళనాడు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. పూర్తిగా కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరగా, కోర్టు 6 వారాల సమయం ఇచ్చింది.
ఈ కేసుపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఆలయంలోకి వెళ్లవచ్చని, దేవుడు వారి కోసం ఎదురుచూస్తాడని భావించకూడదని, వీఐపీ దర్శనాలు ఎందుకు కావాలి? దేవుడు అందరికి సమానమే కదా అని వ్యాఖ్యానించింది.సనాతన ధర్మం ధనికుడు, పేదవాడు అనే భేదాన్ని చూపడదని, అందర్ని సమానంగా చూస్తుందని, అదనపు డబ్బు తీసుకుని ప్రత్యేక దర్శనాలు కల్పించడం హిందూ శాస్త్రాల్లో ఎక్కడా లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఇది భక్తుల నుంచి డబ్బులు దోచుకోవడమే అని ఆరోపించారు. ద్రావిడ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత వీఐపీ కల్చర్ పెరిగిందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,19,21,25లకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు.
తాజావార్తలు
-
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
-
Pakistan: పాక్లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Anil Ravipudi: త్రివిక్రమ్ను అనిల్ రావిపూడి డామినేట్ చేసేశాడా?
-
Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
-
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఎన్టీఆర్!
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!